Webdunia - Bharat's app for daily news and videos

Install App

సామ్రాట్ పృథ్వీరాజ్ చిత్రాన్ని చూసేందుకు థియేటర్లో ఒక్కరు లేరు.... స్టార్ హీరోకి మరీ ఇంత షాకా...

Webdunia
శనివారం, 11 జూన్ 2022 (18:05 IST)
కొన్ని సినిమాలు ఎందుకు బాక్సాఫీస్ వద్ద బోర్లా పడతాయో, ఇంకొన్ని సినిమాలు మరెందుకు కాసుల వర్షం కురిపిస్తాయో ఎవ్వరికీ అర్థంకాదు. దీనితో టాప్ స్టార్లు చాలామంది చాలాసార్లు చేదు గుళికలు మింగాల్సి వస్తుంది. తాజాగా అక్షయ్ కుమార్ పరిస్థితి అలా మారిందట.

 
సుమారు రూ. 300 కోట్ల భారీ వ్యయంతో అక్షయ్ కుమార్ హీరోగా సామ్రాట్ పృథ్వీరాజ్ చిత్రం నిర్మించింది యశ్ రాజ్ ఫిల్మ్స్. చక్రవర్తి పృథ్వీరాజ్ చౌహాన్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం జూన్ 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఐతే వారం తిరిగేసరికల్లా సినిమా థియేటర్లలో ప్రేక్షకులే లేకుండా పోయారట.

 
ఈ పరిస్థితితో చాలాచోట్ల థియేటర్లలో షోలను నిలిపివేస్తున్నట్లు బాలీవుడ్ సినీవర్గాల భోగట్టా. ఆనాటి చరిత్రను ఇప్పటితరానికి కనెక్ట్ అయ్యేట్లు తీసేందుకు రూ. 300 కోట్లు ఖర్చుపెడితే ఇప్పటివరకూ రూ. 55 కోట్లు మాత్రమే వచ్చిందట. దీనితో ఎన్నో అంచనాలతో విడుదలైన సామ్రాట్ పృథ్వీరాజ్ చిత్రం ఘోరంగా బాక్సాఫీస్ వద్ద బోర్లాపడినట్లయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మిథున్ రెడ్డికి షాకిచ్చిన సుప్రీంకోర్టు... సరెండర్‌కు కూడా నో టైమ్..

Hyderabad: పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు..

Hyderabad: స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25- ఆరవ పరిశుభ్రమైన నగరంగా హైదరాబాద్

ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో లాలూకు చిక్కులు.. కేసు విచారణ వేగవంతం చేయాలంటూ...

భార్యాపిల్లలను బావిలో తోసేశాడు... ఆపై గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments