Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జైపూర్ ప్యాలెస్‌‌లో అమ్మకు దెయ్యం కనిపించింది.. ఆమెతో మాట్లాడింది కూడా?

Twinkle Khanna
, శనివారం, 4 జూన్ 2022 (18:16 IST)
Twinkle Khanna
బాలీవుడ్ నటి, సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ అర్ధాంగి ట్వింకిల్ ఖన్నా జైపూర్ ప్యాలెస్‌కు సంబంధించి ఆసక్తికర అంశాలను ప్రస్తావించారు. యూట్యూబ్ చానల్ కోసం జైపూర్ రాజవంశీకురాలు రాజమాత పద్మినీ దేవితో ముచ్చటించారు. 
 
గతంలో ఓసారి తన తల్లి జైపూర్ రాయల్ ప్యాలెస్‌ను సందర్శించిందని, అప్పుడు ఆమెకు ఆ రాజ భవనంలో దెయ్యం కనిపించిందని ట్వింకిల్ తెలిపారు. అంతేకాదు, తన తల్లి ఆ దెయ్యంతో మాట్లాడిందని కూడా చెప్పారు. 
 
1990లో 'లేకిన్' అనే హిందీ చిత్రం షూటింగ్ కోసం డింపుల్ కపాడియా అక్కడికి వెళ్లిందని, ఓ రాత్రంతా జైపూర్ ప్యాలెస్ లోనే గడిపిందని ట్వింకిల్ వివరించారు. 
 
తన తల్లి పడుకుని ఉండగా, ఆమె పడక పక్కనే ఓ మహిళ నిల్చుని కనిపించిందని, అది దెయ్యం అని తన తల్లి గుర్తించినట్టు తెలిపారు. దాంతో చాలాసేపు మాట్లాడినట్టు కూడా పేర్కొన్నారు.
 
అయితే, రాజమాత పద్మినీ దేవి దీనిపై స్పందిస్తూ... ఆ సమయంలో డింపుల్ నటిస్తోంది ఓ దెయ్యం సినిమాలో అని, ఆ ప్రభావం ఆమెపై పడి ఉంటుందని అభిప్రాయపడ్డారు. రోజంతా దెయ్యంలా నటించి, దెయ్యం ఆలోచనలతోనే పడుకున్నావు కాబట్టి, నీకు దెయ్యం కనిపించినట్టు భ్రమపడుతున్నావని డింపుల్‌కు వివరించినట్టు రాజమాత పద్మినీ దేవి వెల్లడించారు. ఇంకా జైపూర్ ప్యాలెస్‌లో దెయ్యాలేవీ లేవన్న విషయాన్ని ఆమెకు స్పష్టం చేశానని తెలిపారు. 
 
'లేకిన్' చిత్రంలో డింపుల్ 'రేవా' అనే దెయ్యం పాత్ర పోషించారు. గుల్జార్ తెరకెక్కించిన ఈ చిత్రంలో వినోద్ ఖన్నా, అంజాద్ ఖాన్, అలోక్ నాథ్ తదితరులు నటించారు. ఈ సినిమాలో అత్యుత్తమ నటనకు గాను డింపుల్ కపాడియాకు ఫిలింఫేర్ అవార్డు కూడా లభించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పూజా హెగ్డే రాక‌తో జ‌న‌గ‌ణ‌మ‌ణ షూటింగ్ ప్రారంభం