Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిలేడి శిల్పా చౌదరి వెల్లడించిన ఆ ఇద్దరు ఎవరు?

Webdunia
ఆదివారం, 5 డిశెంబరు 2021 (13:34 IST)
కిట్టీ పార్టీల పేరు, అధిక వడ్డీల పేరుతో అనేక మందిని మోసం చేసిన కిలేడీ శిల్పా చౌదరి వద్ద పోలీసులు విచారణ జరుపుతున్నారు. శుక్రవారం నుంచి శనివారం సాయంత్రం వరకు రెండు రోజుల పాటు ఆమె వద్ద పోలీసులు కోర్టు అనుమతితో విచారణ జరిపారు. ఈ విచారణలో ఆమె ఇద్దరి పేర్లను వెల్లడించినట్టు సమాచారం. 
 
ముఖ్యంగా, వారి ఒకరు శంకరంపల్లికి చెందిన రాధికా రెడ్డి. ఈమెకు రూ.6 కోట్లు ఇచ్చానిని శిల్పాచౌదరి పోలీసులకు తెలిపారు. అలాగే, మరో పేరును వెల్లడించారు. ఆ పేరు ఎవరన్నది బయటకు తెలియకపోయినప్పటికీ, ఆ వ్యక్తిని సోమవారం విచారణకు హాజరుకావాల్సిందిగా పోలీసులు నోటీసులు జారీచేసినట్టు సమాచారం. 
 
ఇదిలావుంటే, శిల్ప వద్ద పోలీసులు విచారణ జరుపుతూనే గండిపేటలోని ఆమె నివాసంలో పోలీసులు సోదాలు కూడా చేశారు. అలాగే, నాలుగు బ్యాంకు ఖాతాలను గుర్తించారు. ఈ ఖాతాల్లో పైసా డబ్బులు లేవని గుర్తించారు. అయితే, రెండు ఖాతాలను స్తంభింపజేశారు. 
 
ఇదిలావుంటే, శిల్పారెడ్డి తన పేరును వెల్లడించినట్టు వార్తలు రావడంతో రాధికారెడ్డి స్పందించారు. తనకు ఎవరూ డబ్బు ఇవ్వలేదని చెప్పారు. మాదాపూర్‌లో ఏసీపీని కలిసిన ఆమె అనవసరంగా తన పేరును ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ నంబర్ వుంటేనే తత్కాల్ టిక్కెట్లు బుకింగ్.. రైల్వే శాఖ

వైట్ కాలర్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఆటో డ్రైవర్!!

ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ రూ.15 వేలు: మంత్రి నారా లోకేశ్

మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)

జగన్ - భారతి వల్లే ఈ దరిద్రమంతా : ఆదినారాయణ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments