Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్న రొమాంటిక్ హీరో

Webdunia
గురువారం, 20 డిశెంబరు 2018 (13:35 IST)
టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన తాజా చిత్రం "పడి పడి లేచే మనసు" చిత్రం ఈనెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రం తర్వాత శర్వానంద్ గ్యాంగ్‌స్టర్‌గా నటించనున్నాడు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోంది.
 
ఈ చిత్రం షూటింగ్ కోసం హైదరాబాద్‌ శివార్లలో భారీ సెట్‌ కూడా వేశారు. ఈ చిత్రం షూటింగ్ 50 శాతం మేరకు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను శర్వానంద్ బహిర్గతం చేశారు. 
 
తన తదుపరి చిత్రం సుధీర్ వర్మ సినిమాలో నటిస్తానని ఇందులో గ్యాంగ్‌స్టర్ పాత్రను పోషించనున్నట్టు చెప్పాడు. 1980 బ్యాక్ డ్రాప్‌లో నడిచే ఈ సినిమాలో శర్వా రెండు షేడ్స్‌లో కనిపించబోతున్నాడు. ప్రజెంట్, పాస్ట్ షేడ్స్‌లో శర్వానంద్‌ను ఇందులో చూపించబోతున్నారు. దీనికి సంబంధించిన త్వరలోనే ఫస్ట్‌లుక్ రిలీజ్ చేస్తామని ప్రకటించాడు.
 
ప్రస్తుతం 'పడిపడి లేచే మనసు' సినిమా ప్రచారంలో ఉన్న శర్వానంద్, ఈ మూవీ థియేటర్లలోకి వచ్చిన వెంటనే సింగిల్ షెడ్యూల్‌లో శర్వానంద్ సినిమాను పూర్తిచేయబోతున్నట్టు ప్రకటించాడు. ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా నటించనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడికి వచ్చిన యువతిపై సామూహిక అఘాయిత్యం.. ఎక్కడ?

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments