Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్న రొమాంటిక్ హీరో

Webdunia
గురువారం, 20 డిశెంబరు 2018 (13:35 IST)
టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన తాజా చిత్రం "పడి పడి లేచే మనసు" చిత్రం ఈనెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రం తర్వాత శర్వానంద్ గ్యాంగ్‌స్టర్‌గా నటించనున్నాడు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోంది.
 
ఈ చిత్రం షూటింగ్ కోసం హైదరాబాద్‌ శివార్లలో భారీ సెట్‌ కూడా వేశారు. ఈ చిత్రం షూటింగ్ 50 శాతం మేరకు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను శర్వానంద్ బహిర్గతం చేశారు. 
 
తన తదుపరి చిత్రం సుధీర్ వర్మ సినిమాలో నటిస్తానని ఇందులో గ్యాంగ్‌స్టర్ పాత్రను పోషించనున్నట్టు చెప్పాడు. 1980 బ్యాక్ డ్రాప్‌లో నడిచే ఈ సినిమాలో శర్వా రెండు షేడ్స్‌లో కనిపించబోతున్నాడు. ప్రజెంట్, పాస్ట్ షేడ్స్‌లో శర్వానంద్‌ను ఇందులో చూపించబోతున్నారు. దీనికి సంబంధించిన త్వరలోనే ఫస్ట్‌లుక్ రిలీజ్ చేస్తామని ప్రకటించాడు.
 
ప్రస్తుతం 'పడిపడి లేచే మనసు' సినిమా ప్రచారంలో ఉన్న శర్వానంద్, ఈ మూవీ థియేటర్లలోకి వచ్చిన వెంటనే సింగిల్ షెడ్యూల్‌లో శర్వానంద్ సినిమాను పూర్తిచేయబోతున్నట్టు ప్రకటించాడు. ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా నటించనుంది. 

సంబంధిత వార్తలు

2024 టీడీపి నో మోర్, జనసేన పరార్, రోజా ఇలా అనేశారేంది రాజా? (video)

మాజీ సీఎం జగన్ తాడేపల్లి ఇంటి ముందు రోడ్డు ద్వారా Live View (video) చూసేద్దాం రండి

వామ్మో ఎండలు... అధిక ఉష్ణోగ్రత దెబ్బకు ఆగిపోయిన విమానం!!

జగన్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి : బ్రాహ్మణ వేదిక నేత ఫిర్యాదు

జగన్ అభిమాన పోలీసులకు హోం మంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్!!

అసిడిటీ తగ్గించుకోవడానికి అద్భుతమైన చిట్కాలు

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

తర్వాతి కథనం
Show comments