Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంగమ్మత్తగా అనసూయ తీసుకున్న తొలి సెల్ఫీ ఇదే..

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన సినిమా ''రంగస్థలం''. శుక్రవారం ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ప్రి-రిలీజ్ వసూళ్లు బాగానే పండాయి. ఈ సినిమాలో టాప్ హీరోయిన్ సమంత కథా

Webdunia
గురువారం, 29 మార్చి 2018 (09:35 IST)
సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన సినిమా ''రంగస్థలం''. శుక్రవారం ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ప్రి-రిలీజ్ వసూళ్లు బాగానే పండాయి. ఈ సినిమాలో టాప్ హీరోయిన్ సమంత కథానాయకిగా నటిస్తోంది. ఇక ఈ చిత్రంలో రంగమ్మత్త పాత్రను పోషించిన నటి, యాంకర్ అనసూయ తాజాగా ఓ ఫొటో పోస్ట్ చేసింది.
 
తొలిసారి రంగమ్మత్త గెటప్‌లో దిగిన తొలి సెల్ఫీని మీతో పంచుకుంటున్నా.. మరో రెండు రోజుల్లో రంగమ్మత్తను థియేటర్లలో కలవండి అని తన ట్వీట్‌లో పేర్కొంది. కాగా, ఈ నెల 30న రంగస్థలం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకా ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, ఆది పినిశెట్టి తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. 
 
ఈ సినిమా 80వ దశకం బ్యాక్ గ్రౌండ్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ హక్కుల ధరలన్నీ కలుపుకుంటే సుమారు ఎనభై కోట్ల రూపాయల వ్యాపారాన్ని రంగస్థలం చేసిందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎయిరిండియా విమాన ప్రమాదం - దర్యాప్తు అధికారికి ఎక్స్ కేటగిరీకి భద్రత

మహా న్యూస్ చానెల్‌‍పై దాడిని తీవ్రంగా ఖండించిన పవన్ కళ్యాణ్

కాంగ్రెస్ నేతలంటే అపార గౌరవం... సీరియస్‌గా తీసుకోవద్దు : కొండా మురళి

భర్తకి 12 మంది స్త్రీలతో వివాహేతర సంబంధం, భార్యను 8 సార్లు కత్తితో పొడిచాడు

ఐఫోన్‌లో షూట్ చేస్తే రీల్స్ ఎక్కువగా వస్తాయనీ.. యువకుడి గొంతు కోశారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments