Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను ఇంకా బతికే వున్నా.. తప్పుడు ప్రచారాలు ఆపండి.. శక్తిమాన్

Webdunia
బుధవారం, 12 మే 2021 (12:44 IST)
Mukesh Khanna
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చాలా ఎక్కువయ్యాయి. ముఖ్యంగా బ్రతికి ఉన్న వారిని కూడా చంపేస్తున్నారు. రీసెంట్‌గా సింగర్‌ లక్కీ అలి చనిపోయాడంటూ ప్రచారం చేయగా, అవన్నీ వాస్తవాలని ఖండించాడు సదరు సింగర్. 
 
ఇక ఇప్పుడు శక్తిమాన్ సీరియల్ ఫేం ముఖేష్ ఖన్నా కూడా తాను క్షేమంగా ఉన్నానని చెప్పుకోవలసిన పరిస్థితి వచ్చింది. కరోనా వలన ఆయన చనిపోయారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా స్పందించాడు.
 
నేను పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను. కోవిడ్ వలన నేను ఆసుపత్రిలో చేరినట్టు వస్తున్న వార్తలలో వాస్తవం లేదు. ఈ తప్పుడు ప్రచారాలు ఎవరు సృష్టిస్తున్నారో, ఆ ప్రచారాల వెనుక ఉద్దేశం ఏంటో కూడా అర్ధం కావడం లేదు. 
 
ఏం చేస్తే ఇలాంటివి మానేస్తారు. సోషల్ మీడియా వలనే ఎక్కువగా ఈ సమస్య వస్తుంది. ఫేక్ న్యూస్ సృష్టించి ప్రజల ఎమోషన్స్‌తో ఆడుకోవడం దారుణం. ఈ వార్తలతో విసిగిపోయాను. ఇలాంటి వార్తలు సృష్టించే వారిని కఠినంగా శిక్షించాలి అంటూ ముఖేష్ కన్నా వీడియో ద్వారా తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments