Webdunia - Bharat's app for daily news and videos

Install App

'శైలజారెడ్డి అల్లుడు'కి డేట్ ఫిక్స్... భార్యాభర్తల మధ్య పోటీ?

అక్కినేని నాగ చైతన్య నటించిన తాజా చిత్రం "శైలజారెడ్డి అల్లుడు". ఈ చిత్రంలో అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటించగా, సీనియర్ నటి రమ్యకృష్ణ అత్తగా నటించింది. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ఈనెల 31వ తేదీ

Webdunia
ఆదివారం, 26 ఆగస్టు 2018 (13:32 IST)
అక్కినేని నాగ చైతన్య నటించిన తాజా చిత్రం "శైలజారెడ్డి అల్లుడు". ఈ చిత్రంలో అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటించగా, సీనియర్ నటి రమ్యకృష్ణ అత్తగా నటించింది. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ఈనెల 31వ తేదీన విడుదల కావాల్సి వుంది. అయితే, అనివార్య కారణాల రీత్యా ఈ చిత్రం విడుదలను వాయిదా వేశారు.
 
అయితే కేరళలో రీ రికార్డింగ్ చేస్తోన్న గోపీ సుందర్, వరదల కారణంగా సకాలంలో తన పనిని పూర్తిచేయలేకపోయాడు. దాంతో ఈ సినిమా ముందుగా అనుకున్నట్టుగా ఈ నెల 31వ తేదీన థియేటర్లకు రావడం లేదు. "వినాయక చవితి" సందర్భాన్ని పురస్కరించుకుని వచ్చేనెల 13వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారనేది తాజా సమాచారం. 
 
అదే రోజున 'యూ టర్న్', 'నన్నుదోచుకుందువటే' సినిమాలు విడుదలవుతోన్న సంగతి తెలిసిందే. యుటర్న్ చిత్రం నాగచైతన్య సతీమణి, టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన చిత్రం కావడం గమనార్హం. సో, సెప్టెంబరు 13న భార్య సమంతతో నాగచైతన్య పోటీపడేందుకు సిద్ధమయ్యారన్నమాట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Polavaram: పోలవరం-బనకచర్ల ప్రాజెక్టును రాజకీయం చేయొద్దు.. చంద్రబాబు వార్నింగ్

Etala: నా ఫోన్‌ను బీఆర్ఎస్ సర్కార్ ట్యాప్ చేసింది.. ఈటెల రాజేందర్ ఫైర్

తెలంగాణ వాసి రాకేష్ ఆర్నెకి మిస్టర్ ఇండియా 2025 టైటిల్

టూరిస్ట్ సైట్స్ చూపిస్తానని నమ్మించి.. ఫ్రెంచ్ పర్యాటకురాలిపై అత్యాచారం..

కూటమి ప్రభుత్వ పాలన అద్భుతంగా వుంది, తిరుమల శ్రీవారు కళకళ: శివాజి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments