Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీరెడ్డిపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు... వదిలేయండి మహాప్రభో అంటున్న...

ఠాగూర్
శుక్రవారం, 15 నవంబరు 2024 (12:00 IST)
గత వైకాపా ప్రభుత్వ పాలనలో నోటికి పనిచెప్పి, విపక్ష నేతలను దుర్భాషలాడుతూ అసభ్య పదజాలంతో వీడియోలు పోస్టు చేసిన వారి నటి శ్రీరెడ్డి ఒకరు. ఆమె ఇపుడు వణికిపోతున్నారు. కారణం ఆమెపై ఏపీ వ్యాప్తంగా పలు కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా, ఆమెపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. 
 
టీడీపీ నేతలపై సామాజిక మాధ్యమాల్లో రెచ్చ గొట్టే ప్రకటనలు చేసినందుకు సినీ నటి శ్రీరెడ్డిపై గుడివాడ వన్ టౌన్ పోలీసులు గురువారం ఈ కేసును నమోదు చేశారు. ముఖ్య మంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, ఉప ముఖ్యమంత్రి కె.పవన్ కల్యాణ్, హోం మంత్రి వంగలపూడి అనితపై అత్యంత అసభ్యకరంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టి.. వారి ప్రతిష్టకు భంగం కలిగేలా ప్రవర్తిస్తున్న సినీ నటి శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ నేతలు ఫిర్యాదు చేశారు. 
 
దీంతో శ్రీ రెడ్డిపై 192, 196, 53(1)(బి), 352(3), 75(1)(4), 79 బీఎన్ఎఎస్ చట్టం, సెక్షన్ 67, 67(ఎ) ఐటీ చట్టం, సెక్షన్ 3(1)(డబ్ల్యూ) ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం 1989 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు, విజయవాడలోని కృష్ణలంక పోలీసులు కూడా శ్రీరెడ్డిపై కేసు నమోదు చేశారు. దళిత మహిళ అయిన హోంమంత్రి వంగలపూడి అని తను కించపరుస్తూ అతి దారుణంగా పోస్టులు పెట్టిన శ్రీరెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments