Webdunia - Bharat's app for daily news and videos

Install App

థ్రిల్లర్ క‌థ‌తో సాయిధరమ్‌తేజ్‌రీ ఎంట్రీ

Webdunia
సోమవారం, 13 జూన్ 2022 (14:36 IST)
Sayidharam Tej
ఆ మధ్య  సీరియస్‌ యాక్సిడెంట్‌ని ఫేస్‌ చేసిన సాయధరమ్‌తేజ్‌ మెల్లిమెల్లిగా కోలుకున్నారు. రికవరీ మోడ్‌లో కొన్నాళ్ల  పాటు ఆయన బ్రేక్‌ తీసుకున్నారు. పూర్తిగా కోలుకున్నాక షూటింగ్‌ సెట్స్ కి హాజరవుతున్నారు. రీఎంట్రీలో ఆయనకు సెట్స్ లో గ్రాండ్‌ వెల్‌కమ్‌ అందింది.
ప్రస్తుతం కార్తిక్‌ దండు డైరక్షన్‌లో సినిమా చేస్తున్నారు సాయిధరమ్‌తేజ్‌. 
 
స్టార్‌ ప్రొడ్యూసర్‌ బీవీయస్‌యన్‌ ప్రసాద్‌, క్రియేటివ్‌ డైరక్టర్‌ సుకుమార్‌ కలిసి నిర్మిస్తున్న సినిమాలో నటిస్తున్నారు సాయిధరమ్‌తేజ్‌. ఎస్‌వీసీసీ, సుకుమార్‌ రైటింగ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. శామ్‌దత్‌ షైనుద్దీన్‌ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. క్యూరియాసిటీ పెంచే మిస్టిక్‌ థ్రిల్లర్‌ ఇది. షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది.
 
ఫ్యాన్స్ కోసం మేకర్స్ బిహైండ్‌ ద సీన్స్ పిక్చర్‌ని విడుదల చేశారు. లైట్‌, షాడో మధ్య కనిపిస్తోంది పిక్చర్‌. డీప్‌ షాడోస్‌లో మేకర్స్ ఫ్రేమ్‌ పెట్టినట్టు అర్థమవుతోంది. 25 రోజుల్లో 30 శాతం సినిమా షూటింగ్‌ పూర్తయింది. టీమ్‌ పడ్డ శ్రమ ఎలాంటిదో దీన్ని బట్టి అర్థమవుతుంది.
 
సాయి కెరీర్‌లో చేస్తున్న ఫస్ట్  మిస్టిక్‌ థ్రిల్లర్‌ ఇది. ఆయన ఫ్యాన్స్ తో పాటు, సినీ వర్గాల్లోనూ ఆ ఎగ్జయిట్‌మెంట్‌ కనిపిస్తోంది. ఫస్ట్ లుక్‌ చూసి అందరూ ఫిదా అయ్యారు. ఆ క్యూరియాసిటీతోనే సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నారు.
 
బ్లాక్‌ మ్యాజిక్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రమిది. వరుస చావులకు కారణం తెలుసుకోవడానికి ఓ విలేజ్‌కి వెళ్లిన హీరో  కథే ఈ సినిమా. 'సిద్ధార్థి నామ సంవత్సరే, బృహస్పతి సింహరసౌ స్థిత సమయే, అంతిమ పుష్కరే' అంటూ పోస్టర్‌ మీద రాసిన మాటలు ఆకట్టుకుంటున్నాయి. హిందూ కాలమానం ప్రకారం 53వ సంవత్సరంలో జరిగిన విషయాలను గుర్తు చేస్తున్నాయి.
సినిమా ఆద్యంతం అద్భుతంగా వస్తోందని అంటున్నారు మేకర్స్. త్వరలోనే మిగిలిన విషయాలను వెల్లడిస్తామని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

Sadhguru: ఉగ్రవాదులు కోరుకునేది యుద్ధం కాదు.. ఏదో తెలుసా? ఐక్యత ముఖ్యం: సద్గురు

Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments