Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమితాబ్ ఇల్లు జల్సా ముందు ధర్నా...

Webdunia
గురువారం, 19 సెప్టెంబరు 2019 (16:04 IST)
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కాలుష్యం నివారణ కోసం సోషల్ మీడియాలో మంచిగా చేసిన ఓ ట్వీట్ ఆయన కొంప ముంచింది. ఆయనపై ఆగ్రహంతో పర్యావరణ ప్రేమికులు అడవులు తోటల నుంచి రావంటూ బ్యానర్‌లతో, ట్వీట్‌లతో ఆయనను విమర్శించారు. 
 
ఇంతకీ అమితాబ్ ట్వీట్‌లో ఏముందంటే.. నా స్నేహితుడికి మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా కారులో కాకుండా మెట్రోలో ప్రయాణించాడు. తిరిగి వచ్చిన తర్వాత కారు కంటే మెట్రోలో ప్రయాణం ఎంతో సౌకర్యంగా ఉందని, వేగంగా గమ్యానికి చేరుకున్నానని వివరించాడు. కాబట్టి కాలుష్యాన్ని అరికట్టాలంటే మెట్రో ప్రయాణమే మార్గం. ఎక్కువగా చెట్లను పెంచండి. నేను నా తోటలో చెట్లు పెంచుతున్నాను. మరి మీరు? అని ఉంది.
 
కాలుష్యంపై జనాలకు అవగాహన కలిగించాలని చేసిన ట్వీట్‌తో ప్రజలు మెట్రో ప్రయాణాలు చేస్తారని భావించిన అమితాబ్‌కు చేదు అనుభవం ఎదురైంది. తోటలో చెట్లు పెంచడం ఏంటంటూ, ఎన్ని చెట్లు పెంచినా మాత్రం తోటలు అడవులవుతాయా అంటూ పర్యావరణ ప్రేమికులు, పలువురు యువకులు అమితాబ్ నివాసమైన జల్సా ముందు నిరసన చేపట్టారు. అయితే, ముంబై మెట్రో రైల్ ఎండీ అశ్విని భిడే ట్విట్టర్ వేదికగా అమితాబ్‌కు ధన్యవాదాలు చెప్పారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఇంకా మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
 
అయితే ముంబైలో మెట్రో అందుబాటులో లేని ప్రాంతాలలో దాన్ని నిర్మించాలంటే ఆరే ప్రాంతంలోని 27వేల చెట్లను నరికేయాలని బీఎంసీ సిద్ధమైంది. విషయం తెలుసుకున్న పర్యావరణ ప్రేమికులు, సామాన్యులు, ప్రముఖులు దీన్ని అడ్డుకోగా ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వెనక్కి తగ్గింది. ఈ నేపథ్యంలో మెట్రో అవసరాన్ని అమితాబ్ చెప్పడంతో, అలాగే తోటలో చెట్లను పెంచమనడంతో పర్యావరణ ప్రేమికులు, నెటిజన్లు ఈ చెట్లను నరికివేసేందుకు అమితాబ్ మద్దతు ఇస్తున్నారా? అంటూ మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments