Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్కారు వారి పాట నుంచి శివరాత్రికి గిఫ్ట్.. వీడియో రిలీజ్ కానుందట!

Webdunia
బుధవారం, 17 ఫిబ్రవరి 2021 (11:11 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాటలో నటిస్తున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు పరశురామ్ రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా దుబాయ్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవల దుబాయ్‌లో మొదటి షెడ్యూల్ పూర్తి అయింది. వెంటనే రెండో షెడ్యూల్ ప్రారంభం అయింది. ఈ రెండో షెడ్యూల్ ఈ నెల 21 వరకు కొనసాగనుంది. 
 
ఈ షెడ్యూల్ కోసం ఇటీవల కీర్తి సురేష్ దుబాయ్ చేరుకున్నారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా నుంచి ఓ స్పెషల్ అప్‌డేట్ రానుందంట. అది కూడా శివరాత్రి సందర్భంగా మార్చి 11న రానుందని వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా ఓ చిన్న వీడియోను రిలీజ్ చేయనున్నారని టాక్ నడుస్తోంది. 
 
ఈ వీడియోలో మహేష్ తన సినిమాలోని ప్రత్యేకమైన బైట్ ఇవ్వబోతున్నారని, చిత్రీకరణలోని ఆఫ్ కెమెరా మేకింగ్ సన్నివేశాలు కూడా ఉండనున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ విషయంలో క్లారిటీ కావాలంటే శివరాత్రి వరకు వేచి చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments