Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

''పాట'' కోసం మహానటి.. దుబాయ్‌కి వెళ్తూ ఫోటోకు ఫోజు.. వైరల్

Advertiesment
Keerthy Suresh
, సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (16:05 IST)
Keerthy Suresh
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట షూటింగ్ దుబాయ్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే. అమెరికా ఆపై దుబాయ్‌లో ఈ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను దుబాయ్‌లో చిత్రీకరిస్తారు. ఇందుకోసం కీర్తిసురేష్‌ దుబాయ్‌కి బయలు దేరింది. ఈ విషయాన్ని కీర్తిసురేష్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలియజేస్తూ మెసేజ్‌ను పోస్ట్‌ చేసింది. 
 
సర్కారువారిపాట సినిమా షూటింగ్‌ షురూ అవుతుందని, చాలా ఎగ్జయిటింగ్‌ ఉందని కీర్తిసురేష్‌ ఫొటోతో పాటు షేర్‌చేసిన మెసేజ్‌ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. మహానటి తర్వాత ఎక్కవగా హీరోయిన్‌ సినిమాలకే ఓటు వేస్తూ వచ్చిన కీర్తిసురేష్‌కు .. ఆమె చేసిన ఉమెన్‌ సెంట్రిక్‌ మూవీస్‌ ఏవీ కలిసి రాలేదు. ఆ టైమ్‌లోనే సూపర్‌స్టార్‌ మహేశ్‌తో 'సర్కారు వారి పాట' సినిమాలో అవకాశం వచ్చింది. 
 
కమర్షియల్‌ సినిమా అయినప్పటికీ కీర్తిసురేష్‌ ఏమాత్రం ఆలస్యం చేయకుండా సినిమాలో నటించడానికి ఓకే చెప్పేసింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్‌ షెడ్యూల్‌ చిత్రీకరణను తొలి షెడ్యూల్‌లో పూర్తి చేశారు. ఇప్పుడు హీరో, హీరోయిన్స్‌ మధ్య సన్నివేశాలను సెకండ్‌ షెడ్యూల్‌లో పూర్తి చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓమ్ కార్ రియల్టర్స్ కేసు: సచిన్ జోషి అరెస్ట్