Webdunia - Bharat's app for daily news and videos

Install App

బన్నీ ఫంక్షన్‌ను పక్కనబెట్టి.. మహేష్ కోసం వస్తున్న మెగాస్టార్

Webdunia
ఆదివారం, 5 జనవరి 2020 (13:28 IST)
సరిలేరు నీకెవ్వరు మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు  మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా హాజరు కానున్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్, ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా హాజరు అవ్వనున్నారు.
 
ఇదే సమయంలో జరగనున్న ఆల వైకుంఠపురంలో వేడుకకు మాత్రం ముఖ్య అతిథిగా ఎవ్వరు రావడంలేదట. టాలీవుడ్‌లో చిరును మించిన గెస్ట్ ఎవ్వరు లేరని, ఒకవేళ అల వైకుంఠపురం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మరొకరిని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తే మెగాస్టార్ స్థాయిని తక్కువ చేసినట్లు అవుతుందని బన్నీ భావిస్తున్నాడట. అందుకే చీఫ్ గెస్ట్ గా ఎవరిని పిలవద్దని దర్శక, నిర్మాతలకు సూచించినట్లు సమాచారం. దీంతో ఎవర్ని పిలవకుండానే వేడుకను నిర్వహించాలని చిత్ర యూనిట్ అనుకుంటుందట.
 
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా అల వైకుంఠపురం మూవీ వస్తున్నా సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పూజా హెగ్డే, నివేదా పేతురాజు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ హీరోయిన్ టబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పాటలు హిట్ అయిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కీలక ఎయిర్‌బేస్‌లను భారత్ ధ్వంసం చేసింది.. అందుకే తలొగ్గాం : పాక్ ఉప ప్రధాని

భువనేశ్వరి నా జీవితానికి వెలుగు : సీఎం చంద్రబాబు

ఇరాక్‌పై అమెరికా సైనిక చర్య... డోనాల్డ్ ట్రంప్ నిర్ణయం?

మారన్ ఫ్యామిలీలో మంటలు... రచ్చకెక్కిన కుటుంబ కలహాలు..

శ్రీవారికి మాత్రమే కాదు.. దుర్గమ్మ, శ్రీశైలం, కాణిపాకానికి కూడా కల్తీ నెయ్యి సరఫరా...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments