Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సరిలేరు నాకెవ్వరు' అంటున్న ప్రిన్స్ మహేష్.. అరుదైన రికార్డు... ఏంటది?

Webdunia
మంగళవారం, 14 జనవరి 2020 (11:02 IST)
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం "సరిలేరు నీకెవ్వరు". ఈ చిత్రం ఈనెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో "సరిలేరు నాకెవ్వరు" అని మహేష్ బాబు అంటున్నారు. దీనికి కారణం.. ఈ హీరో ఖాతాలో ఓ అరుదైన రికార్డు చేరడమే. 
 
అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కోసం జనవరి 11వ తేదీన విడుదలైంది. ఇందులో రష్మక మందన్నా హీరోయిన్ కాగా, సీనియర్ నటి విజయశాంతి కీలక పాత్రను పోషించింది. అయితే, ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌తో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఫలితంగా మహేష్ బాబు మరో విజయాన్ని సొంతం చేసుకున్నాడు. 
 
'స్పైడర్' తర్వాత వచ్చిన "భరత్ అనే నేను", 'మహర్షి' చిత్రాలు సూపర్ డూపర్ హిట్స్. ఇపుడు 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం కూడా ఈ జాబితాలోకే చేరింది. పైగా, ఈ చిత్రం ఓవర్సీస్‌లో కేవలం రెండు రోజుల్లోనే 1.5 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. అంటే, ఈ మొత్తంలో కలెక్షన్లు వసూలు చేసిన చిత్రంగా 'సరిలేరు నీకెవ్వరు' ఏడో చిత్రంగా నిలిచింది. 
 
గతంలో మహేష్ నటించిన 'దూకుడు', 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు', 'శ్రీమంతుడు', 'స్పైడర్', 'భరత్ అనే నేను', 'మహర్షి' చిత్రాలు కూడా ఓవర్సీస్‌లో తమ హవాను కొనసాగించి అతి తక్కువ కాలంలోనే 1.5 మిలియన్ డాలర్లను వసూలు చేశాయి. ఇపుడు 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం మహేష్ ఖాతాలో ఏడో చిత్రంగా నిలిచింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పహల్గామ్‌ మృతుడు మధుసూధన్ రావుకు పవన్ నివాళులు

Pahalgam: పహల్గమ్‌ బాధితులకు పూర్తిగా ఉచిత వైద్య చికిత్స: ముకేష్ అంబానీ

మేమేం తక్కువ తినలేదంటున్న పాకిస్థాన్ : గగనతలం - సరిహద్దులు మూసివేత..

Duvvada Srinivas : నేను ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదు.. లంచాలు తీసుకోలేదు.. జగన్‌కు థ్యాంక్స్

పహల్గాంలో ఉగ్రదాడి.. ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లోకి కేక్ బాక్స్‌తో వెళ్లిన వ్యక్తి - Video Viral

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments