Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ సమాజం.. మగాళ్లను ఎందుకు ప్రశ్నించదు... సమంత

Webdunia
శుక్రవారం, 8 అక్టోబరు 2021 (11:19 IST)
అక్కినేని నాగ చైతన్య- సమంతల వివాహం విడాకులతో ముగిసింది. ఏడేళ్ల ప్రేమ, మూడేళ్ల వివాహబంధాలకు పుల్ స్టాప్ పెట్టారు ఈ జంట. ఇక వైవాహిక బంధాన్ని కొనసాగలించలేమని, కేవలం స్నేహితులుగానే ఉండాలనుకుంటున్నామని సోషల్‌ మీడియా వేదికగా సంచలన ప్రకటన చేశారు. 
 
అయితే ఈ జంట విడిపోవడానికి అంత బలమైన కారణాలు ఏమై ఉంటాయా అని పలువురు ఆరా తీస్తుంటే.. మరికొందరూ సమంతను టార్గెట్ చేస్తూ కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఫ్యామిలీ మెన్‌-2 వెబ్‌ సిరీస్‌లో బోల్డ్‌ కంటెంట్ చేసిందనీ, గ్లామరస్‌ ఫోటో షూట్‌లే చేసిందనీ, మరికొందరూ ఓ లైన్ దాటి.. ఆమె స్టైలిస్ట్‌ ప్రీతమ్‌తో ఎఫైర్ ఉందనీ దారుణంగా ట్రోల్ చూస్తూ నిందలేస్తున్నారు.
 
ఇవే విడాకులకు కారణాలని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో కొందరూ సమంతకు సపోర్ట్‌గా నిలుస్తూ వచ్చారు. కానీ ట్రోల్స్ ఆగడంలేదు. ఈ క్రమంలో సమంత తన మనసులోని బాధను బహిర్గతం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ షేర్ చేసింది. మహిళలను ప్రశ్నించే ఈ సమాజం.. అదే మగాళ్లను ఎందుకు ప్రశ్నించదు. అంటే మనకు ప్రాథమికంగా నైతికత లేనట్టేనా అంటూ కామెంట్ పోస్టు చేసింది. ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది.
 
నాగచైతన్య నుంచి దూరమయ్యాక సమంత చాలా బాధపడుతున్నట్టు తెలుస్తుంది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ యాడ్‌ షూటింగ్‌లో పాల్గొన్న ఆమె షాట్‌ గ్యాప్‌లో కంటతడి పెట్టుకున్నట్లు సమాచారం. విడాకుల ప్రకటనతో సమంత కుంగిపోయినట్లు తెలుస్తుంది.

సంబంధిత వార్తలు

వామ్మో ఎండలు... అధిక ఉష్ణోగ్రత దెబ్బకు ఆగిపోయిన విమానం!!

జగన్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి : బ్రాహ్మణ వేదిక నేత ఫిర్యాదు

జగన్ అభిమాన పోలీసులకు హోం మంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్!!

జగన్ జల్సా ప్యాలెస్‌లో ఏమున్నాయి.. వాటికి ఖర్చు చేసిన ధరలు ఎంతో తెలుసా?

పనికిమాలిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి శాపమే : సీఎం చంద్రబాబు

అసిడిటీ తగ్గించుకోవడానికి అద్భుతమైన చిట్కాలు

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

తర్వాతి కథనం
Show comments