Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ సమాజం.. మగాళ్లను ఎందుకు ప్రశ్నించదు... సమంత

Webdunia
శుక్రవారం, 8 అక్టోబరు 2021 (11:19 IST)
అక్కినేని నాగ చైతన్య- సమంతల వివాహం విడాకులతో ముగిసింది. ఏడేళ్ల ప్రేమ, మూడేళ్ల వివాహబంధాలకు పుల్ స్టాప్ పెట్టారు ఈ జంట. ఇక వైవాహిక బంధాన్ని కొనసాగలించలేమని, కేవలం స్నేహితులుగానే ఉండాలనుకుంటున్నామని సోషల్‌ మీడియా వేదికగా సంచలన ప్రకటన చేశారు. 
 
అయితే ఈ జంట విడిపోవడానికి అంత బలమైన కారణాలు ఏమై ఉంటాయా అని పలువురు ఆరా తీస్తుంటే.. మరికొందరూ సమంతను టార్గెట్ చేస్తూ కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఫ్యామిలీ మెన్‌-2 వెబ్‌ సిరీస్‌లో బోల్డ్‌ కంటెంట్ చేసిందనీ, గ్లామరస్‌ ఫోటో షూట్‌లే చేసిందనీ, మరికొందరూ ఓ లైన్ దాటి.. ఆమె స్టైలిస్ట్‌ ప్రీతమ్‌తో ఎఫైర్ ఉందనీ దారుణంగా ట్రోల్ చూస్తూ నిందలేస్తున్నారు.
 
ఇవే విడాకులకు కారణాలని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో కొందరూ సమంతకు సపోర్ట్‌గా నిలుస్తూ వచ్చారు. కానీ ట్రోల్స్ ఆగడంలేదు. ఈ క్రమంలో సమంత తన మనసులోని బాధను బహిర్గతం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ షేర్ చేసింది. మహిళలను ప్రశ్నించే ఈ సమాజం.. అదే మగాళ్లను ఎందుకు ప్రశ్నించదు. అంటే మనకు ప్రాథమికంగా నైతికత లేనట్టేనా అంటూ కామెంట్ పోస్టు చేసింది. ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది.
 
నాగచైతన్య నుంచి దూరమయ్యాక సమంత చాలా బాధపడుతున్నట్టు తెలుస్తుంది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ యాడ్‌ షూటింగ్‌లో పాల్గొన్న ఆమె షాట్‌ గ్యాప్‌లో కంటతడి పెట్టుకున్నట్లు సమాచారం. విడాకుల ప్రకటనతో సమంత కుంగిపోయినట్లు తెలుస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్య స్టెల్లాను పైకెత్తుకుని ముద్దెట్టిన జూలియన్ అసాంజే

స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌లో గద్దలు... రూ.2096 కోట్ల నిధులుంటే.. మిగిలింది రూ.7 కోట్లే...

ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టు!!

సామాజిక సేవకుడిని.. నాలుగేళ్ల ఆ బాలుడు ఏం చేశాడంటే (వీడియో)

ఏపీలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు వెల్లడి... వొకేషన్‌‍లో 78 శాతం ఉత్తీర్ణత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments