Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల చర్మం పాడైంది.. సమంత

Webdunia
శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (10:59 IST)
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం అమెరికాలో మయోసైటిస్‌కు చికిత్స పొందుతోంది. ఖుషీ సినిమా రిలీజ్ తర్వాత సినిమాల్లో నటించడానికి కాస్త బ్రేక్ ఇచ్చింది. ఆమె ప్రస్తుతం ఫ్యామిలీ మ్యాన్ దర్శకులు రాజ్ అండ్ డికె దర్శకత్వంలో సిటాడెల్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. 
 
ఇవి తప్ప సమంత చేతిలో వేరే సినిమాలు లేవు. ఇక సమంత వేరే సినిమాలకు ఒప్పుకోకుండా ఏడాది పాటు బ్రేక్ తీసుకుని అమెరికా వెళ్లి మైయోసైటిస్ వ్యాధికి ట్రీట్ మెంట్ తీసుకుంటోంది. 
 
తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ వీడియో సెషన్‌లో సమంత ముఖంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమె స్కిన్ గ్లో పాడైపోయిందని అర్థమైంది. దీంతో ఓ అభిమాని నీ స్కిన్ ఏమైందని అడిగాడు. 
 
ఇందుకు సమంత సమాధానం ఇచ్చింది, "మయోసిటిస్ కోసం ఎక్కువ స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల నా చర్మంపై కొన్ని సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నేను ఫిల్టర్‌ని ఉపయోగించి మీతో మాట్లాడుతున్నాను." అంటూ అసలు విషయం చెప్పింది. 
 
తన చర్మ సమస్యను పరిష్కరించే బాధ్యతను చిన్మయి తీసుకుందని సమంత సరదాగా చెప్పింది. స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల ఈ స్కిన్ అలర్జీ వస్తోందని చెప్పింది. ఈ విషయం తెలుసుకున్న సమంత ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తల్లి స్థానం దేవుడి కంటే గొప్పది : ప్రధాని నరేంద్ర మోడీ

మీరు కోట్లాది మందికి మార్గదర్శకుడిగా ఉండాలి : ఇట్లు.. మీ తమ్ముడు

థ్యాంక్యూ చిన్నన్నయ్యా.. మీరిచ్చిన పుస్తకమే రాజకీయ చైతన్యం కలిగించింది : పవన్

Onam Dance: కేరళలో ఓనం సంబరాల్లో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి వ్యక్తి మృతి (video)

ఓనం వేడుకల్లో విషాదం.. డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి మృతి చెందిన ఉద్యోగి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments