Webdunia - Bharat's app for daily news and videos

Install App

9 ఏళ్లు పూర్తయినందుకు సమంత అక్కినేని అలా చేసింది...

Webdunia
మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (21:14 IST)
ఈ ఏడాది ఫిబ్రవరి 26తో "ఏ మాయ చేసావే" సినిమా విడుదలై తొమ్మిది సంవత్సరాలు పూర్తి కావస్తోంది. ఆ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన సమంత తర్వాత కాలంలో అగ్ర హీరోయిన్‌గా మారింది. వ్యక్తిగత జీవితంలో కూడా సమంతకు ఈ సినిమా ఎంతో మేలు చేసింది. అప్పటి నుండి చైతు- సమంత మధ్య సాగిన ప్రేమ బంధం 2017 అక్టోబర్‌లో పెళ్లితో ముడిపడిపోయింది. ఈ సందర్భంగా సమంత పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
 
ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన మంజుల మంగళవారం ఈ సినిమా గురించి ట్వీట్ చేసారు. ‘అప్పుడే తొమ్మిదేళ్లు పూర్తవుతోంది, అంతా నిన్న జరిగినట్లే ఉంది. ఈ సినిమా కోసం పని చేసిన వారందరికీ అభినందనలు’ అంటూ మంజుల పోస్ట్‌ చేసారు. 
 
ఈ పోస్ట్‌కు సమంత బదులిస్తూ ‘నా జీవితాన్ని మార్చేసిన అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు’ అంటూ రీట్వీట్ చేసారు. అదే సమయంలో అభిమానులకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ‘మీరంటూ లేకుంటే నటిగా నాకు ఈ స్థానం దక్కేదే కాదు’ అని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments