Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరాటపర్వం తర్వాత మాట్లాడుతా.. నేను వుంటే అలా జరిగేది కాదు.. ?

Webdunia
శుక్రవారం, 17 జూన్ 2022 (17:31 IST)
గో రక్షకుల గురించి, 'ద కాశ్మీర్ ఫైల్స్' సినిమా గురించి సాయిపల్లవి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై హైదరాబాద్ సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్‌లో భజరంగ్ దళ్ కార్యకర్తలు కంప్లయింట్ చేశారు. పోలీసులు హీరోయిన్ సాయిపల్లవిపై కేసు నమోదు చేసి వీడియో పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. 
 
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో సాయిపల్లవిపై కొందరు ట్రోల్ చేస్తున్నారు. కాగా, 'విరాటపర్వం' ప్రమోషన్స్‌లో ఈ వివాదంపై సాయిపల్లవి స్పందించింది. తాను చేసిన వ్యాఖ్యలకు డెఫినెట్‌గా సమాధానం చెప్తానని, కానీ, అందుకు సమయం ఇది కాదని స్పష్టం చేసింది.
 
తనను వివాదం నుంచి బయటకు తీసుకురావాలని అభిమానులు చూస్తున్నారని తను తెలుసని, అయితే, తనకు ప్రస్తుతం 'విరాట పర్వం' సినిమానే ముఖ్యమని తెలిపింది. 
 
పిక్చర్ రిలీజ్ అవుతున్న క్రమంలో తాను హ్యాపీగా ఉన్నానని , ఫిల్మ్ విడుదల తర్వాత తాను వివాదం గురించి మాట్లాడతానని స్పష్టం చేసింది. 
 
రానా ఈ విషయమై మాట్లాడుతూ తాను లేని టైంలో సాయిపల్లవితో మాట్లాడించారని, తాను ఉండి ఉంటే ఇంత వరకు వచ్చేది కాదని అన్నాడు. వివాదాల గురించి మాట్లాడాల్సిన సందర్భం కాదని వివరించాడు. 'విరాట పర్వం' చిత్రాన్ని విజయవంతం చేయాలని కోరాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Sreeleela: శ్రీలీల కోసం మంత్రి శ్రీధర్ బాబును అగౌరవపరిచిన ఝాన్సీ.. ట్రోల్స్

Talli Ki Vandanam: పాఠశాలలకు వెళ్లే పిల్లల తల్లులకు శుభవార్త

TTD: తిరుమల గ్రీనింగ్ ప్రాజెక్టు.. 2025కల్లా పూర్తి.. రూ.4కోట్లతో ప్రణాళిక

నేను ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ ఫ్యామిలీకి ఎంట్రీ లేదు : సీఎం రేవంత్

Ice Cream: ఐస్‌క్రీమ్‌లో బల్లి.. ఆ బాలుడికి ఏమైందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments