తెరమీద తప్ప జీవితంలో నటించలేని సున్నితమనస్కులు : సాయి ధరమ్ తేజ్

ఠాగూర్
గురువారం, 3 అక్టోబరు 2024 (17:02 IST)
సినీ నటులు తెరమీద మినహా జీవితంలో నటించలేని సున్నిత మనస్కులు అంటూ హీరో సాయిధరమ్ తేజ్ అన్నారు. సమంత విడాకుల అంశంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన విమర్శలపై హీరో సాయి ధరమ్ తేజ్ స్పందించారు. రాజకీయంలో వ్యక్తిగత విమర్శలు సర్వసాధారణమైపోయాయిని వాపోయారు. 
 
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీమతి కొండా సురేఖ బుధవారం రోజున రాజకీయ ప్రత్యర్థులపై ఆరోపణలు చేస్తూ ఒక ప్రఖ్యాత కథానాయకి పేరును ఉపయోగించడం, ఓ ప్రఖ్యాత సినిమా కుటుంబ వ్యహారాలను ఉటంకించి, మీడియా ముఖంగా మాట్లాడడం వారికి రాజకీయంగా ఎంత లబ్ధి చేకూరుతుందో తెలియదు కానీ.. ఓ మహిళ ఆత్మాభిమానం, ఓ కుటుంబం పరువు, ప్రతిష్టలకు తీరని నష్టం, అన్యాయం జరిగిందన్నారు. 
 
గౌరవనీయులైన మంత్రివర్యులకు, రాజకీయ విమర్శలకు ఏ మాత్రం సంబంధం లేని, తెరమీద తప్ప జీవితంలో నటించలేని సున్నితమనస్కులైన.. సినీనటులను బలిచేయవద్దని, జరిగిన తొందరపాటు చర్యను, విజ్ఞులైనమీరు పెద్దమనసుతో సరిదిద్దే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నట్టు, భవిషత్తులో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకుంటారని వినమ్రంగా విన్నవించుకుంటున్నాను అని సాయి ధరమ్ తేజ్ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో... యువతి ప్యాంటు జేబులో పేలిన ఫోను, మంటలు (video)

తొక్కిసలాటపై విజయ్, అజిత్, ధనుష్ బాధపడుతున్నారు: నటి అంబిక

తిరుమలలో 3 గంటల పాటు భారీ వర్షం.. ఇబ్బందులకు గురైన భక్తులు

Jagan Anakapalle Tour: జగన్ రోడ్ టూర్‌కు అనుమతి నిరాకరణ

ప్రియురాలితో రాత్రంతా గడిపి హత్య చేసి ఇంట్లోనే సమాధి చేసిన కర్కోటకుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments