Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు సరైనవారి చేతుల్లో సేఫ్‌గా వుంది - పుష్ప సెట్లో ఆనంద హేళ !

డీవీ
మంగళవారం, 4 జూన్ 2024 (13:50 IST)
pawan kalyan with child (AP)
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంతో ఒకవైపు తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటుంటే మరోవైపు  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు, శ్రేయోభిలాషులు మరింత ఆనందంలో మునిగిపోయారు. అలాంటిది కుటుంబ సభ్యుల సంగతి సరేసరి. టీవీల్లో రిజల్ట్ వివరాలు చూస్తున్న మెగాస్టార్ చిరంజీవి  ఆనంధాన్ని పట్టలేకుండా వున్నామని సన్నిహితులు తెలియజేస్తున్నారు.
 
మరి బాబాయ్, మామయ్య వరుసఅయ్యేవారి పరిస్థితి ఎలా వుంటుందో ఊహించుకో వచ్చు. తాజా సమాచారం ప్రకారం ఈరోజు హైదరాబాద్ శివార్లలో రిసార్ట్ లో పుష్ప సీక్వెల్ షూట్ జరగనుంది. సాయంత్రం జరుగుతున్న ఈ షూట్ లో సక్సెస్ కేక్ ను కట్ చేయడానికి చిత్ర యూనిట్ కేక్ ను సిద్ధం చేయించినట్లు తెలుస్తోంది.
 
ఇక సాయిధరమ్ తేజ్ అయితే, వపన్ కళ్యాణ్ చిన్న పిల్లవాడిని ఎత్తున్న ఫొటోను షేర్ చేసి తగిన కాప్షన్ పెట్టి ఫ్యాన్స్ ను ఫిదా చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత & భవిష్యత్తు ఇప్పుడు సురక్షితమైన చేతుల్లో ఉంది అని పేర్కొన్నారు. దీనికి సోషల్ మీడియాలో అవును నిజమే.. అంటూ ఆనందంతో స్పందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం - ఉత్తర కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన

కుమార్తెపై బహిష్కరణ వేటు వేసిన తండ్రి కేసీఆర్

చనిపోయాడనుకున్న వ్యక్తిని ఆ పచ్చబొట్టు కాపాడింది.. నిరంజన్ రెడ్డి అలా కాపాడారు

ప్లీజ్.. ఎమ్మెల్యే పింఛన్ మంజూరు చేయండి : దరఖాస్తు చేసుకున్న మాజీ ఉపరాష్ట్రపతి

TGSRTC: ఐటీ కారిడార్‌లో 275 ఎలక్ట్రిక్ బస్సులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments