Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్ర లో ఐదేళ్లు నరకానికి ముగింపు పడింది : నందమూరి రామకృష్ణ

డీవీ
మంగళవారం, 4 జూన్ 2024 (13:35 IST)
Nandamuri Ramakrishna, Sivaprasad, Kiran, Sai Jyoti, Perepi Eshwar, Pathan Hayat Khan, Kalesha Vali
దుర్గమ్మను దర్శించుకున్న నందమూరి రామకృష్ణ రాష్ట్రానికి ఇకపై అంతా మంచే జరగాలని కోరుకున్నారు. రాష్ట్రానికి, ప్రజలకు ఇకపై అంతా మంచి జరిగేలా ఆశీర్వదించాలని నందమూరి తారక రామారావు కుమారుడు నందమూరి రామకృష్ణ ఆకాంక్షించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపైనున్న దుర్గమ్మను దర్శించుకున్నారు. ఎన్నికల ఫలితాలు కూటమికి సానుకూలంగా రాబోతున్నాయని, ఇకపై ప్రజలకు అంతా మంచి జరగనుందన్నారు. ఐదేళ్లుగా అనుభవిస్తున్న నరకానికి ఈ రోజుతో ముగింపు కలగబోతోందన్నారు. 
 
Nandamuri Ramakrishna
అమ్మవారి చల్లని దీవెనలు రాష్ట్రంపై, ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ప్రజలకు అవస్థలు, తిప్పలు, పన్నుల మోతలు తప్ప మరేమీ లేవు. యువతకు ఉద్యోగాల్లేవు. రైతులకు గిట్టుబాటు ధరల్లేవు. అభివృద్ధి అనేదే రాష్ట్రంలో లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల నుండి రాష్ట్రాన్ని మెరుగైన మార్గంలో నగిపించేలా ఎన్డీఏ కూటమికి అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. కార్యక్రమంలో వీరమాచనేని శివప్రసాద్, వల్లూరు కిరణ్, సాయి జ్యోతి, పేరేపి ఈశ్వర్, పఠాన్ హయ్యత్ ఖాన్, కాలేషా వలి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఐఎస్ఎస్‌లో డ్యాన్స్ చేసిన సునీతా విలియమ్స్.. వీడియో వైరల్

మృగశిర కార్తె ప్రారంభం... నాంపల్లిలో చేప మందు పంపిణీ!!

అంకుల్ మేమిద్దరం ఇష్టపడ్డాం... పెళ్లి చేయండి... : ఠాణాను ఆశ్రయించిన బాలికలు!!

ఎన్డీయే కూటమిని ప్రజలు తిరస్కరించారు.. మోడీ ప్రధాని పదవి వద్దనాలి!!

ఈవీఎం ధ్వంసం కేసు : వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి ఊరట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మజ్జిగ ఇలాంటివారు తాగకూడదు, ఎందుకంటే?

ఈ రసం తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయ్

ఖాళీ కడుపుతో లవంగాలను నమిలితే 7 ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

ఈ పదార్థాలు తింటే టైప్ 2 డయాబెటిస్ వ్యాధిని అదుపు చేయవచ్చు, ఏంటవి?

బాదం పప్పులు తిన్నవారికి ఇవన్నీ

తర్వాతి కథనం
Show comments