హీరో చనిపోతే ట్విస్ట్ ఏముంది.. విలన్ చనిపోవాలగానీ.. కానీ ఇక్కడ హీరో అయినా.. తాను చేసేది ఓ ప్రముఖ పాత్ర అందుకే ఆ పాత్ర కిల్ అవుతుంది.. దీన్ని చేయడానికి మెగా హీరో సాయిధరమ్ తేజ్ ముందుకు వచ్చాడు. ఆ చ
మెగా హీరోలు ఒక్కొక్కరుగా తన టాలెంట్ను పరీక్షించేందుకు ముందుకు వస్తున్నారు. అయితే హీరోకు సెంటిమెంట్పరంగా.. చనిపోయే పాత్రలు వేయడం జరగదు. కథలో ఎంతో ప్రాముఖ్యంత ఉంటే తప్ప.. హీరో చనిపోతే ట్విస్ట్ ఏముంది.. విలన్ చనిపోవాలగానీ.. కానీ ఇక్కడ హీరో అయినా.. తాను చేసేది ఓ ప్రముఖ పాత్ర అందుకే ఆ పాత్ర కిల్ అవుతుంది.. దీన్ని చేయడానికి మెగా హీరో సాయిధరమ్ తేజ్ ముందుకు వచ్చాడు. ఆ చిత్రం పేరు 'నక్షత్రం'. ఈ చిత్రానికి కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్నారు.
అంతటి పెద్ద దర్శకుడు ఒక వేషం ఇచ్చి చేయమంటే ఏమంటారు.. చేసేస్తారు. సాయిధరమ్ కూడా అలాగే చేశాడు. కృష్ణవంశీ దర్శకుడితో చేయడం చాలా అదృష్టం. అయితే.. ఆయన పోలీసు పాత్ర అన్నారు. నేను ఓకే అన్నాను. కానీ చనిపోయే పాత్రని నాకూ తెలియదు.. ఆ పాత్ర వివరాలు తెలుసుకుని చేస్తానని సాయిధరమ్తేజ్ చెబుతున్నాడు.
అయితే.. యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాలో ఆయన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు కూడా. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. సందీప్ కిషన్, రెజీనా హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమా దసరా సీజన్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ముందుగా అనుకున్నట్లు పోలీసుపాత్రకు ముగింపు ఉంటుందా? అనేది సినిమా చూశాకే తెలియాల్సి వుంది.