Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వర్ణ దేవాలయంలో 'ఆర్ఆర్ఆర్' బృందం

Webdunia
సోమవారం, 21 మార్చి 2022 (13:44 IST)
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిన చిత్రం "ఆర్ఆర్ఆర్" ఈ నెల 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదలవుతుంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు కలిసి నటించిన ఈ చిత్రంలో అజయ్ దేవగణ్, అలియా భట్, శ్రియ తదితరులు నటించారు. 
 
అయితే, మరో నాలుగు రోజుల్లో సినిమా విడుదలవుతుండటంతో ఈ చిత్ర బృందం ప్రమోషన్స్‌ను జోరుగా చేస్తుంది. ఇప్పటికే కర్నాటక, ఢిల్లీ, దుబాయ్‌లలో ఈ వేడుకలను గ్రాండ్‌గా నిర్వహించింది. 
 
ఆదివారం రాత్రి ఢిల్లీలో నిర్వహించిన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత చిత్ర బృందం అటు నుంచి నేరుగా అమృతసర్‌కు వెళ్లి చిత్రం విజయం కోసం స్వర్ణ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. 
 
ముగ్గురు 'ఆర్ఆర్ఆర్‌'లు (రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్‌)లు పంజాబీ సంప్రదాయంలో తలకు వస్త్రం చుట్టుకుని అక్కడ నది ఒడ్డున ప్రార్థిస్తున్నట్టున్న ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ చిత్రం పెద్ద సక్సెస్ కావాలని ఈ సందర్భంగా వారు మనస్ఫూర్తిగా కోలుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

నెలమంగళం టోల్‌ప్లాజాలో అరాచకం... (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments