Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాంగోపాల్ వర్మ తదుపరి చిత్రం "కమ్మ రాజ్యంలో కడప రెడ్లు"

Webdunia
ఆదివారం, 26 మే 2019 (18:32 IST)
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తన తదుపరి చిత్రం పేరును ప్రకటించారు. ఆయన ఆదివారం విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ, తాను నిర్మించిన "లక్ష్మీస్ ఎన్టీఆర్" చిత్రం ఈ నెల 30వ తేదీన విడుదల అవుతుందన్నారు. అలాగే, తన తదుపరి చిత్రం "కమ్మ రాజ్యంలో కడప రెడ్లు" అని ప్రకటించారు. ఈ చిత్ర కథను ఇంకా రాయలేదని, ఇకపై రాస్తానని చెప్పారు. 
 
విజయవాడ వచ్చిన తర్వాతే తనకు ఈ స్టోరీ ఐడియా వచ్చిందన్నారు. విజయవాడ రాగానే బోయపాటి సినిమాలోలా సుమోలు తిరుగుతున్నాయని, కడపలో చూసిన రెడ్లంతా ఇక్కడే ఉన్నారంటూ నవ్వులు కురిపించారు. అందుకే, తనకు ఒక ఇన్సిపిరేషన్ వచ్చిందని, ఇక కథ రాయడం మొదలు పెడతానని వర్మ వ్యాఖ్యానించారు.
 
అలాగే, చిరంజీవి - పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రస్థానం గురించి స్పందిస్తూ, నాడు ప్రజారాజ్యం పార్టీకి 18 సీట్లు వచ్చాయని, నేడు జనసేన పార్టీకి ఒక్క సీటు మాత్రమే వచ్చిందని, 18 సీట్లు సంపాదించిన చిరంజీవి తన దృష్టిలో 'బాహుబలి'గా అభివర్ణించారు. 'జనసేన' తరపున నరసాపురం ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైన చిరంజీవి సోదరుడు నాగబాబు గురించి వర్మ వద్ద ప్రస్తావించగా, ఆయన ఎక్కడ నుంచి పోటీ చేశారో కూడా తనకు తెలియదని వర్మ చమత్కరించారు.
 
ఇకపోతే, లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని వివాదాస్పదం చేసింది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడేనని చెప్పారు. ఈ చిత్రాన్ని తప్పని పరిస్థితుల్లో తీయాల్సి వచ్చిందన్నారు. ఈ చిత్రంలో నిజం చెప్పబోతున్నాననీ, కానీ, అది చాలా మందికి నచ్చలేదన్నారు. అందుకే ఈ చిత్రం విడుదల కాకుండా అడ్డుకున్నారన్నారు. అయితే, ఈ నెల 31వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు రాంగోపాల్ వర్మ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

Sadhguru: ఉగ్రవాదులు కోరుకునేది యుద్ధం కాదు.. ఏదో తెలుసా? ఐక్యత ముఖ్యం: సద్గురు

Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments