Webdunia - Bharat's app for daily news and videos

Install App

బస్తీమే సవాల్.. ఆదివారం 4 గంటలకు పైపుల రోడ్డులో ఆర్జీవీ ప్రెస్మీట్

Webdunia
ఆదివారం, 26 మే 2019 (09:19 IST)
ఈ నెల 30వ తేదీన నవ్యాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ మరుసటి రోజున వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. 
 
నిజానికి ఈ చిత్రం ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మినహా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. పైగా, ఘన విజయం కూడా సాధించింది. లక్ష్మీపార్వతి దృష్టికోణం నుంచి ఎన్టీఆర్ జీవిత నేపథ్యంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో చంద్రబాబు నాయుడు పాత్రను పూర్తి నెగెటివ్‌గా చూపించారు. 
 
దీంతో ఈ చిత్రం విడుదలకు టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. పైగా, కోర్టును ఆశ్రయించడంతో కోర్టు కూడా చిత్ర అనుమతికి అనుమతించలేదు. ఎన్నికల ఫలితాల తర్వాత విడుదల చేసుకోవచ్చని సూచన చేసింది. 
 
ఈ నేపథ్యంలో ఈ నెల 30వ తేదీన జగన్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ఆ మరురసటి రోజు ఈ చిత్రాన్ని విడుదల చేసి కుట్రదారుడి అసలు నిజాన్ని చూపిస్తానని వర్మ తాజాగా ఓ ట్వీట్ ద్వారా వెల్లడించారు.
 
అంతేకాకుండా, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనను ఎక్కడైతే అరెస్టు చేసి విజయవాడ నుంచి తరిమికొట్టారే అదే ప్రాంతంలో అంటే విజయవాడ పైపుల రోడ్డులోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఆదివారం 4 గంటలకు విలేకరుల సమావేశం నిర్వహిస్తానని తెలిపారు. బస్తీమే సవాల్. ఎన్.టి.ఆర్ నిజమైన అభిమానులకు ఇదే నా బహిరంగ ఆహ్వానం.. జై జగన్  అంటూ ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments