Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అఖిల్ తదుపరి చిత్రం ఎవరితో తెలుసా?

అఖిల్ తదుపరి చిత్రం ఎవరితో తెలుసా?
, శుక్రవారం, 24 మే 2019 (16:43 IST)
ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న నట వారసులలో హిట్ కోసం తెగ ట్రై చేస్తున్న వారిలో అక్కినేని అఖిల్ ముందున్నాడు. ఇప్పటి వరకూ తాను నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సరైన వసూళ్లను రాబట్టలేదు. తాజాగా వచ్చిన మిస్టర్ మజ్ను కూడా అఖిల్‌ను నిరాశ పరిచింది. కాగా ఈ సినిమా తర్వాత అఖిల్ హీరోగా నటించబోయే కొత్త సినిమా ప్రారంభమైంది. 
 
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో, అల్లు అరవింద్ సమర్పణలో, జీఎ2 పిక్చర్స్ బ్యానర్‌పై, ప్రొడక్షన్ నెం:5గా రూపొందనున్న ఈ సినిమాని బన్నీవాసు, దర్శకుడు వాసువర్మ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఫిల్మ్‌నగర్‌లో జరిగాయి.
 
అక్కినేని నాగార్జున, అమల దంపతులు, అల్లు అరవింద్, అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ తదితరులు హాజరయ్యారు. ఈ మూవీ కోసం అఖిల్ జుట్టు, గెడ్డం పెంచి సరికొత్త లుక్‌లోకి మారిపోయాడు. 
 
ప్రస్తుతం హీరోయిన్‌తో పాటు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ చిత్రానికి సంచలన సంగీత దర్శకుడు గోపి సుందర్ బాణీలను సమకూర్చనున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోదీ, జగన్‌కి శుభాకాంక్షలు తెలిపిన మహేశ్‌బాబు..