Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జగన్ జైత్రయాత్ర ఆధారంగా "యాత్ర" మూవీ సీక్వెల్

జగన్ జైత్రయాత్ర ఆధారంగా
, శుక్రవారం, 24 మే 2019 (14:56 IST)
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘యాత్ర’ అద్భుతమైన విజయం సాధించింది. ఈ సినిమాకి మహి.వి.రాఘవ దర్శకత్వం వహించగా, మలయాళ స్టార్ మమ్ముట్టి రాజశేఖర్ రెడ్డి పాత్రలో అద్భుతమైన నటన కనబరిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే ఈ సార్వత్రిక ఎన్నికలలో వైఎస్ జగన్ ఘన విజయం సాధించడంతో ఈ సినిమాకి సీక్వెల్ రూపొందించే పనిలో ఉన్నాడట దర్శకుడు.
 
2019 సార్వత్రిక ఎన్నికల ముందు వరకు జరిగిన పరిణామాలు, జగన్ పాదయాత్రను ఆధారం చేసుకుని ‘యాత్ర 2’ పేరుతో తెరకెక్కించాలని చూస్తున్నాడట. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలుపుతూ జగన్‌కి శుభాకాంక్షలు తెలియజేసాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ద‌ర్శ‌కేంద్రుడు అలాంటి సినిమాని ప్లాన్ చేస్తున్నారా..?