సినీ నిర్మాత శేఖర్ రాజుపై ఫిర్యాదు చేసిన ఆర్జీవీ

Webdunia
బుధవారం, 20 జులై 2022 (15:28 IST)
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మను వివాదాలతో పాటు చిక్కులు కూడా వీడటం లేదు. ముఖ్యంగా ఆయన నిర్మించే చిత్రాలు ప్రకటించిన తేదీల్లో విడుదల కాకుండా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఆయన నిర్మించి "లడ్‌కీ : ఎంటర్ ది డ్రాగన్" చిత్రం కూడా కోర్టు చిక్కులు ఎదురుకావడంతో విడుదలకు నోచుకోలేదు. 
 
ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలంటూ హైదరాబాద్‌లోని సివిల్ కోర్టు ఆదేశాలు జారీచేసింది. దీంతో చిత్రం విడుదలకు నోచుకోలేదు. మరోవైపు, నిర్మాత శేఖర్ రాజుపై దర్శకుడు రాంగోపాల్ వర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, శేఖర్ రాజే తనకు డబ్బులు ఇవ్వాలన్నారు. లఢ్‌కీ చిత్రంపై ఆయన తప్పుడు సమాచారం ఇచ్చి కోర్టును తప్పుదారి పట్టించారని ఆరోపించారు. శేఖర్ రాజుకు తాను ఇవ్వాల్సింది ఏమీ లేదని చెప్పారు. 
 
తప్పుడు సమాచారంతో తన సినిమాను నిలుపుదల చేయించిన శేఖర్ రాజుపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆయన కోరారు. నినిమాపై ఆధారపడి ఎంతో మంది బతుకుతున్నారని సినిమా విడుదల కాకుండా ఆగిపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Couple on a bike: నడి రోడ్డుపై బైకుపై రెచ్చిపోయిన ప్రేమ జంట (video)

మొంథా తుఫాను సమయంలో రిలయన్స్ ఫౌండేషన్ చేసిన కృషికి ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసలు

శ్రీకాకుళంలో తొక్కిసలాట- మృతులకు 15 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా : నారా లోకేష్ (video)

కాశీబుగ్గ తొక్కిసలాట.. అసలేం జరిగింది.. తొక్కిసలాటకు కారణం ఏంటి?

మొంథా తుఫాను ప్రభావం తగ్గకముందే.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన.. మళ్లీ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

తర్వాతి కథనం
Show comments