Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ నిర్మాత శేఖర్ రాజుపై ఫిర్యాదు చేసిన ఆర్జీవీ

Webdunia
బుధవారం, 20 జులై 2022 (15:28 IST)
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మను వివాదాలతో పాటు చిక్కులు కూడా వీడటం లేదు. ముఖ్యంగా ఆయన నిర్మించే చిత్రాలు ప్రకటించిన తేదీల్లో విడుదల కాకుండా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఆయన నిర్మించి "లడ్‌కీ : ఎంటర్ ది డ్రాగన్" చిత్రం కూడా కోర్టు చిక్కులు ఎదురుకావడంతో విడుదలకు నోచుకోలేదు. 
 
ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలంటూ హైదరాబాద్‌లోని సివిల్ కోర్టు ఆదేశాలు జారీచేసింది. దీంతో చిత్రం విడుదలకు నోచుకోలేదు. మరోవైపు, నిర్మాత శేఖర్ రాజుపై దర్శకుడు రాంగోపాల్ వర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, శేఖర్ రాజే తనకు డబ్బులు ఇవ్వాలన్నారు. లఢ్‌కీ చిత్రంపై ఆయన తప్పుడు సమాచారం ఇచ్చి కోర్టును తప్పుదారి పట్టించారని ఆరోపించారు. శేఖర్ రాజుకు తాను ఇవ్వాల్సింది ఏమీ లేదని చెప్పారు. 
 
తప్పుడు సమాచారంతో తన సినిమాను నిలుపుదల చేయించిన శేఖర్ రాజుపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆయన కోరారు. నినిమాపై ఆధారపడి ఎంతో మంది బతుకుతున్నారని సినిమా విడుదల కాకుండా ఆగిపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. 31 మృతదేహాల గుర్తింపు.. మిగిలినవాటి పరిస్థితి ఏంటి?

బాసరలో విషాదం - గోదావరి నదిలో మునిగి నలుగురు మృతి

చింతల్‌కుంట వద్ద తెగిపడిన హైటెన్షన్ వైర్లు - ఇద్దరు సజీవదహనం

ఫ్లైట్‌లో ఏసీ పని చేయడం లేదు... ఏదో తేడాగా ఉంది.. భర్తకు ఫోన్ చేసిన భార్య.. అంతలోనే...

అహ్మదాబాద్ విమాన ప్రమాదం : వివరమ ఇచ్చిన టర్కీ సంస్థ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments