Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ రాము అమ్మాయిలో కనిపించారు - విజయేంద్ర ప్రసాద్

Vijayendra Prasad, Ram Gopal Varma, Pooja Bhalekar, T. Anjaya and others
, గురువారం, 14 జులై 2022 (17:43 IST)
Vijayendra Prasad, Ram Gopal Varma, Pooja Bhalekar, T. Anjaya and others
టి. అంజయ్య, శ్రేష్ఠ పటేల్ మూవీస్ సమర్పణలో ఇండో, చైనీస్ కో ప్రొడక్షన్స్, పారిజాత క్రియేషన్స్, ఆర్ట్సీ మీడియా పతాకాలపై పూజా భలేకర్ ప్రధాన పాత్రలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఇండియాస్ ఫస్ట్ మార్షల్ ఆర్ట్స్ ఫిలిం ‘లడ్కీ’ (తెలుగులో ‘అమ్మాయి‘). ఈ నెల 15 న ప్రపంచ వ్యాప్తంగా 47,000 స్క్రీన్ లలో విడుదల ఆవుతున్న సందర్బంగా ఇప్పుడు ఈ చిత్రం ఇండస్ట్రీ లో హాట్ టాపిక్‌గా మారింది .తెలుగులో మొట్ట మొదటిసారిగా  మార్షల్ ఆర్ట్స్ పై గ్రాండ్ గా విడుదల అవుతున్న కారణంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని జె. ఆర్. సి కన్వెన్షన్ సెంటర్ లో  ప్రి రిలీజ్  ఈవెంట్ ను ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి,ప్రముఖ దర్శక,రచయిత విజయేంద్ర ప్రసాద్,  మచ్చ రవి, కోన వెంకట్, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ తదితరులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.
 
ముఖ్య అతిధులుగా వచ్చిన రచయిత విజయేంద్ర ప్రసాద్, మాట్లాడుతూ.. 10 నెలల క్రితం నేను "కనబడుటలేదు" ఆడియో ఫంక్షన్ కు వెళ్లడం జరిగింది.అక్కడ రామ్ గోపాల్ వర్మ కూడా ఉన్నారు.15 సంవత్సరాలుగా నాలో గూడు కట్టుకున్న కోపం, చిరాకు, అసహ్యం, బాధ అన్ని కలగలపి నాకు అనుకోకుండా కొన్ని మాటలు వచ్చాయి. శివ సినిమా చూశాను  ఆ సినిమాతో  రాము ఎక్కడికో వెళ్ళిపోయాడు. నేనే కాదు నాలాంటి డైరెక్టర్లు, రచయితలు, టెక్నిషియన్స్ ఇలా ఎందరో ఆయన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకోవడం జరిగింది. ఆ తరువాత  ఆ రాంగోపాల్ వర్మ  కనిపించడం మానేశారు.మీకేమైనా కనిపిస్తే మళ్ళీ అలాంటి సినిమా తీయమని చెప్పండి అనేశాను. ఇప్పుడు "అమ్మాయి"సినిమా ట్రైలర్ చూసిన తరువాత చాలా గర్వంగా చెపుతున్నాను ఇప్పుడు నాకు ఆ రాము కనిపించారు. అలాగే ఈ సినిమా 47000 స్క్రీన్ లలో రిలీజ్ అవ్వడమనేది ఫెంటాస్టిక్ థింగ్. దీన్ని ఎవరూ ఆచ్చీవ్ చేయలేరు. ఎందుకంటే  అవతార్  లాంటి సినిమాలే 20,000 థియేటర్స్ లలో రిలీజ్ అయితే ఈ సినిమా 47,000 స్క్రీన్ లలో రిలీజ్ అవ్వడం తెలుగు వారందరికీ గర్వ కారణం.ఇలాంటి మంచి సినిమా గొప్ప విజయం సాదించాలి అన్నారు.
 
చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. ఇది నేను ఎమోషనల్ అయ్యి తీసిన సినిమా. ఎందుకంటే నా లైఫ్ లైన్ లో వెనక్కి తిరిగి చూసుకుంటే కొన్ని సంఘటనలు జరిగినప్పుడు వ్యక్తులు గుర్తుండిపోతారు. అలాంటి వారే బ్రూస్లీ. నాకు బ్రూస్లీ అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టమంటే నా చిన్నప్పుడు నేను నారాయణ గుడాలోని శ్రీనివాస్ థియేటర్ కు పంజాగుట్ట నుండి సైకిల్ పై 27 సార్లు వెళ్లి  "ఎంటర్ ద డ్రాగన్ " సినిమా చూడడం జరిగింది. అలాగే నాకు బ్రూస్ లీ యాటిట్యూడ్, తన ఫిలాసఫీ నా మీద చాలా ఇంపాక్ట్ చూపించాయి.40 సంవత్సరాలైనా మనం బ్రూస్లీ ఫైట్స్ ఎందుకు మరచిపోలేక పోతున్నాము అని స్టడీ చేసి ఈ సినిమా తీశాను. నేను చేసిన శివ సినిమాలో కూడా బ్రూస్లీ సినిమా "రిటర్న్ అఫ్ ద డ్రాగన్" లోని రెస్టారెంట్ లో అమ్మాయిని రక్షించే ఫైట్ సీన్ ను కాలేజ్ లో ఫైట్ సీన్ గా పెట్టి శివ సినిమా తీశాను. కానీ శివ మార్షల్ ఆర్ట్స్ సినిమా కాదు. కానీ బ్రూస్లీ యాటిట్యూడ్స్ సినిమాలో చాలా ఉంటాయి. తరువాత నేను చేసిన చాలా సినిమాల్లో ఫైట్ సీన్స్ డిజైన్ చేసి వాడడం జరిగింది. ఇండియా లో మార్షల్ ఆర్ట్స్ లేదు. కానీ జాకీ చాన్, జెట్లీ, టోనీజా సినిమాలు వచ్చినప్పుడు చాలా ఎగ్జయిట్ గా ఫీల్ అయ్యేవాన్ని. మార్షల్ ఆర్ట్స్ లో బ్రూస్లీ తనకంటే డబల్ సైజ్ ఉన్న పదిమందిని కొట్ట గలుగుతాడు అని తన సినిమాలతో ప్రేక్షకులను బిలీవ్ చేయించాడు "ఎంటర్ ద డ్రాగన్" సినిమాతో. అయితే నేను ఆ థాట్ ను ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లి అమ్మాయితో మార్షల్ ఆర్ట్స్ తీస్తే ఎలా ఉంటుందనే ఆలోచతో పూజా భలేకర్ ని సెలెక్ట్ చేసుకొని నేను ఇష్టపడే బ్రూస్లీ  కంట్రీ అయిన  చైనాలో "లడ్కీ" ని షూట్ చేయడం, నాకది గొప్ప ఆచీవ్మెంట్ గా భావిస్తాను. నా లైఫ్ లో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ సినిమాలు మూడు. అవి గాడ్ ఫాదర్ (సర్కార్) ,సౌండ్ ఆఫ్ మ్యూజిక్ "రంగీలా", ఇప్పుడు తీసిన "అమ్మాయి". 
 
నేను తీసిన సినిమాలలో ఫ్లాప్ కు నేను ఒక్కడినే కారణం. కానీ హిట్ కు మాత్రం చాలా మంది కారణం. క్షణం క్షణం బాగా వచ్చింది అంటే శ్రీదేవి పెర్ఫార్మన్స్,కీరవాణి  మ్యూజిక్ కారణం. ఆలా ఈ సినిమా బాగా రావడానికి కారణం పూజ.ఈ సినిమా కొరకు పూజ చాలా కష్టపడింది. నన్ను క్వశ్చన్ చేయకుండా ట్రస్ట్ చేయడం గ్రేట్..తను లేకపోతె ఈ సినిమానే లేదు. అలాగే అంజయ్య గారు బాగా సపోర్ట్ చేశారు. సినిమాటోగ్రాఫర్ అయితేనేం ఇలా టెక్నిషియన్స్ అందరూ ఎంతో డెడికేటెడ్ గా  ఫైటింగ్ సీన్స్ బాగా వచ్చేవరకు చాలా హార్డ్ వర్క్ చేస్తూ  నన్ను నమ్మి ఇన్ని రోజులు నాతో ట్రావెల్ అయ్యారు. వారందరికీ  ధన్యవాదములు.మొట్ట మొదటి సారి బూర్జ్ కళీఫా మీద ఇంటర్నేషనల్ "లడ్కి" ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది అన్నారు.ఈ నెల 15 న ప్రేక్షకుల ముందుకు  మార్షల్ ఆర్ట్స్ పైన తీసిన ఈ సినిమా 40,000 థియేటర్స్ లలో రిలీజ్ అవుతున్నందుకు చాలా సంతోషం గా వుంది. అన్నారు. 
 
చిత్ర సమర్పకులు టి. అంజయ్య, మరో నిర్మాత మధు మంతెన, హీరోయిన్ పూజ, రవి, కోన వెంకట్తు, మ్మలపల్లి రామ సత్యనారాయణ త‌దిత‌రులు మాట్లాడారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిరంజీవి, అమీర్ ఖాన్, రాజ‌మౌళి, నాగార్జున‌, సుకుమార్ క‌లిసిన వేళ‌