Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంగనాతో కలిసి పనిచేయడం అసౌకర్యంగా ఫీలవుతున్నా.. పీసీ శ్రీరామ్

Webdunia
బుధవారం, 9 సెప్టెంబరు 2020 (11:39 IST)
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బాలీవుడ్ వివాదాస్పద ప్రముఖ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కనున్న ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని ఆయన మంగళవారం తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 
 
ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేస్తూ.. 'కంగనా ప్రధాన పాత్రధారిణిగా ఓ ప్రాజెక్టు తెరకెక్కించాల్సివుంది. కానీ, ఆమెతో కలిసి పనిచేయడం అసౌకర్యంగా భావించాను. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలకు చెప్పగా, వారు అంగీకరించారు. దీంతో ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాను. ఆల్ ది బెస్ట్' అంటూ అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
 
పీసీ శ్రీరామ్ ట్వీట్‌కు కంగనా రనౌత్ రీట్వీట్ చేస్తూ.. 'తన గురించి మీకు కలిగిన బాధ లేదా అసౌకర్యం ఏంటో తెలియదు. అయితే, మీరు తీసుకున్న నిర్ణయం సబబే. ధన్యవాదాలు.. ఆల్ ది బెస్ట్' అంటూ పేర్కొన్నారు. 
 
కాగా, కంగనా రనౌత్ ఇపుడు జాతీయ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెల్సిందే. ముంబైను ఓ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌తో పోల్చారు. దీంతో శివసేన పార్టీ నేతలు ఆమెపై కారాలుమిరియాలు నూరుతున్నారు. ఫలితంగా శివసేన - కంగనా రనౌత్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kavitha: దీపావళి రోజున కొత్త పార్టీ ప్రకటన చేయనున్న కల్వకుంట్ల కవిత.. రెండు పేర్లు సిద్ధం..?

Ranya Rao: కన్నడ నటి రన్యారావుకు బిగ్ షాక్- రూ.102.55 కోట్ల జరిమానా విధించిన డీఆర్ఐ

Kothagudem: తాగొద్దయ్యా అంటే భార్యను చంపేసిన భర్త.. పోలీసుల ముందు లొంగిపోయాడు

Hyderabad: పెళ్లి చేసుకుంటానని.. లైంగికంగా వాడుకున్నాడు.. 20 ఏళ్ల జైలుశిక్ష

No pay no work: జీతం లేనిదే పని చేసేది లేదు.. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల నిరసన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments