Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ధృవ" విలన్ సరసన హీరోయిన్‌గా రెజీనా

రెజీనా కసాండ్రా. టాలీవుడ్ కుర్ర హీరోయిన్లలో ఒకరు. ఈమె నటించిన అనేక తెలుగు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో ఆమె టాలీవుడ్‌లో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. దీంతో ఆమె కోలీవుడ్ వైపు దృష్టిసా

Webdunia
గురువారం, 23 ఆగస్టు 2018 (15:26 IST)
రెజీనా కసాండ్రా. టాలీవుడ్ కుర్ర హీరోయిన్లలో ఒకరు. ఈమె నటించిన అనేక తెలుగు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో ఆమె టాలీవుడ్‌లో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. దీంతో ఆమె కోలీవుడ్ వైపు దృష్టిసారించింది. 
 
అక్కడ ఆమెకు మంచి ఆఫర్లే వస్తున్నాయి. తాజాగా ఆమె మరో లక్కీ ఛాన్స్ కొట్టేసింది. తమిళంలో తెరకెక్కుతున్న ఓ సినిమాలో రోజా చిత్రం హీరో, ధృవ విలన్ అరవిందస్వామికి జోడీగా రెజీనాను ఎంపిక చేశారు. వచ్చే నెల మొదటి వారంలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రం షూటింగ్ మొత్తం చెన్నైలోనే జరుగనుంది.
 
'ఎన్నమో నడక్కుదు', 'అచ్చమిండ్రి' అనే చిత్రాల ఫేమ్ రాజపాండి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మరోవైపు, సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన అరవిందస్వామికి అనేక వరుస ఆఫర్లు వస్తున్నాయి. మరి రెజీనా, అరవింద స్వామిల కాంబినేషన్ ఎలాంటి ఫలితాన్నిస్తుందో వేచిచూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments