Webdunia - Bharat's app for daily news and videos

Install App

బరిలో అక్క.. ప్రచారానికి దూరంగా ఎన్టీఆర్... అది బయటకు పొక్కకూడదనే...

Webdunia
గురువారం, 6 డిశెంబరు 2018 (17:30 IST)
తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో దివంగత నటుడు నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి వెంకట సుహాసిని పోటీచేస్తున్నారు. ఈమె హైదరాబాద్‌ కూకట్‌పల్లి అసెంబ్లీ స్థానం నుంచి బరిలో ఉన్నారు. ఆమె విజయం కోసం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, హీరోలు బాలకృష్ణ, తారకరత్న వంటివారు ప్రచారం చేశారు. ఈ ఎన్నికల ప్రచారంలో ఆమె సోదరుడు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు కూడా పాల్గొంటారని తొలుత వార్తలు వచ్చాయి. కానీ, వారిద్దరూ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. 
 
అయితే, ఎన్నికల ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉండటానికి గల కారణాలు ఏంటో ఇపుడు బహిర్గతమయ్యాయి. ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తీస్తున్న చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో మెగా హీరోగా కూడా ఉన్నారు. ఈ చిత్రం కోసం జూనియర్ ఎన్టీఆర్ బాగా బరువు పెరుగుతున్నారట. 
 
అందుకు సంబంధించిన ఓ ఫోటో కూడా వైరల్ అవుతోంది. దాదాపు 100 కేజీలకు పైగా బరువుతో ఉన్న ఎన్టీఆర్.. తన లుక్‌ రివీల్ కాకూడదన్న జక్కన్న సూచనతోనే బయటకు రావడం లేదని అంటున్నారు. అయితే, ఎన్నికల్లో పోటీ చేస్తున్న తమ సోదరిని గెలిపించాలని నందమూరి బ్రదర్స్ కళ్యాణ్ రామ్, తారక్‌లిద్దరూ ప్రెస్‌నోట్ విడుదల చేశారు. 

సంబంధిత వార్తలు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments