Webdunia - Bharat's app for daily news and videos

Install App

రమాప్రభతో జరిగింది వివాహం కాదు.. ఒక కలయిక మాత్రమే : శరత్‌బాబు

Webdunia
ఆదివారం, 3 ఫిబ్రవరి 2019 (12:18 IST)
సినీనటి రమాప్రభతో జరిగిన వివాహంపై సినీ నటుడు శరత్‌బాబు స్పందించారు. రమాప్రభను తాను మోసం చేసినట్టు వచ్చిన వార్తలపై ఆయన క్లారిఫై ఇచ్చారు. ఏమీ తెలియని వయసులో కాలేజీ నుంచి ఫ్రెష్‌గా తాను సినిమా రంగంలోకి అడుగుపెట్టానని చెప్పారు.
 
ముఖ్యంగా, తనకు 22 యేళ్ళ వయసులో ప్రపంచంతో పాటు సమాజంపై ఎలాంటి అవగాహన లేని వయసులో తాను తీసుకున్న నిర్ణయం తన జీవితంపై అమితమైన ప్రభావం చూపిందన్నారు. 
 
ప్రధానంగా తన కంటే ఐదారేళ్లు పెద్దదైన రమాప్రభను పెళ్లి చేసుకున్నానని తెలిపారు. తమ మధ్య జరిగింది వివాహం కాదని... ఒక కలయిక మాత్రమేనని అన్నారు. రమాప్రభను తాను మోసం చేశానని, ఆమె ఆస్తులను కాజేశానని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని శరత్‌బాబు వివరణ ఇచ్చారు.
 
ఈ ఆరోపణలు రావడంతో తన పేరుపై ఉన్న ఒక ఆస్తిని విక్రయించి రమాప్రభ, ఆమె సోదరుడు పేర్లపై ఆస్తులు కొని ఇచ్చానని, వాటి విలువ ఇపుడు రూ.50 నుంచి 60 కోట్ల రూపాయల వరకు ఉంటుందని చెప్పారు. అలాగే, టీ నగర్‌లో మరో ఆస్తి విలువ వంద కోట్లకు పైగా ఉంటుందని శరత్ బాబు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments