Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయాల్లోకి వస్తా.. ప్రజలకు ఎలా సాయం చేయాలో తెలుసు: రాశీఖన్నా

Webdunia
బుధవారం, 9 డిశెంబరు 2020 (18:33 IST)
తెలుగు ప్రేక్షకులను తన అందచందాలతో మెప్పించిన హీరోయిన్ రాశీఖన్నా ప్రస్తుతం తమిళ చిత్రాల్లో నటిస్తోంది. ప్రస్తుతం తమిళ సినిమాలపై ఎక్కువ ఫోకస్ పెట్టిన రాశీఖన్నా అందరినీ ఆశ్చర్యానికి గురిచేసే ఓ విషయం చెప్పింది.

రాశీఖన్నా కోలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాలిటిక్స్ గురించి మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందని.. భవిష్యత్తులో రాజకీయాల్లోకి తప్పకుండా వస్తానని చెప్పింది. 
 
రాజకీయం ఎలా చేయాలో తనకు తెలియదు, కానీ ప్రజలకు ఎలా సాయం చేయాలో మాత్రం తనకు చాలా బాగా తెలుసు అని రాశీఖన్నా చెప్పుకొచ్చింది. చిన్నప్పటి నుంచి తనకు ఐఏఎస్ అధికారి కావాలని ఉండేది. కానీ నటిగా మారిపోయాను అంటూ రాశీఖన్నా తెలిపింది.
 
భవిష్యత్తులో పక్కాగా రాజకీయాల్లోకి వెళ్తానని... అంతకంటే ముందు ఓ ఎన్జీవో ప్రారంభిస్తానని చెప్పింది. ప్రజల సమస్యలు ఏంటో తెలుసుకుంటానని. వాళ్ల సమస్యలు అర్థం చేసుకుని సహాయం చేయడానికి ప్రయత్నిస్తానని వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలిని సూట్‌‍కేసులో దాచిపెట్టీ.... ప్రియుడి సాహసం (Video)

అయోధ్య గెస్ట్ హౌస్‌లో మహిళ స్నానం చేస్తుంటే ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసా?

నల్గొండలో అర్థరాత్రి హత్య కలకలం.. వేట కత్తులతో కలర్ ల్యాబ్‌ ఓనర్ హత్య

విశృంఖల ప్రేమకు చిరునామాగా మెట్రో రైళ్లు! బెంగుళూరు మెట్రోలో యువకుడి విపరీత చర్య! (Video)

మహిళతో ముఖ పరిచయం.. ఆపై న్యూడ్ ఫోటోలు పంపాలంటూ జైలర్ వేధింపులు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments