Webdunia - Bharat's app for daily news and videos

Install App

''రంగస్థలం'' పాటలో ఆ చరణం.. యాదవ మహిళలను కించపరిచేలా వుందట

''రంగస్థలం'' చిత్రానికి చిక్కొచ్చిపడింది. ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతున్న నేపథ్యంలో ముంబై భామ మాన‌సి పాడిన‌ రంగస్థలంలోని ''రంగమ్మ మంగమ్మ... పాటలో ''గొల్లభామ వచ్చి నాగోరు గిచ్చుతుంటే'' అంటూ సాగిన చరణం

Webdunia
గురువారం, 15 మార్చి 2018 (12:33 IST)
''రంగస్థలం'' చిత్రానికి చిక్కొచ్చిపడింది. ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతున్న నేపథ్యంలో ముంబై భామ మాన‌సి పాడిన‌ రంగస్థలంలోని ''రంగమ్మ మంగమ్మ... పాటలో ''గొల్లభామ వచ్చి నాగోరు గిచ్చుతుంటే'' అంటూ సాగిన చరణం యాదవ మహిళలను కించపరిచే విధంగా ఉందని.. వెంటనే దాన్ని తొలగించాలని యాదవ హక్కుల పోరాట సమితి జాతీయాధ్యక్షుడు రాములు యాదవ్ డిమాండ్ చేశారు. 
 
యాదవుల పట్ల దర్శకుడు, నిర్మాత, రచయితల‌ వైఖరి సరికాదన్నారు. పాటలోని ఆ చరణాన్ని వెంట‌నే తొలగించాలని, లేదంటే సినిమా ప్రదర్శనను అడ్డుకుంటామని రాములు హెచ్చరించారు. ఈ హెచ్చరికపై రంగస్థలం యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. 
 
ఇకపోతే రామ్ చ‌ర‌ణ్‌, స‌మంత హీరోహీరోయిన్లుగా, ఆదిపినిశెట్టి, అనసూయ కీలక పాత్రల్లో కనిపించనున్న రంగస్థలం సినిమా మార్చి 30వ తేదీన రిలీజ్ కానుంది. ప్రస్తుంత ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం ఏర్పాట్లు చేస్తున్న యూనిట్... సినిమా ప్రమోషన్‌పై కూడా దృష్టి పెట్టింది. 

సంబంధిత వార్తలు

భారత్‌ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

తర్వాతి కథనం
Show comments