Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జక్కన్న-ఎన్టీఆర్-చెర్రీ.. సినిమా: అక్టోబర్‌లో సెట్స్‌పైకి.. శరవేగంగా ఏర్పాట్లు

బాహుబలి మేకర్ ఎస్ఎస్ రాజమౌళి తదుపరి ప్రాజెక్టు త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఎన్టీఆర్-చెర్రీ కాంబోలో మల్టీస్టారర్ సినిమా చేసేందుకు రాజమౌళి రెడీ అయ్యాడు. ఇప్పటికే ఓ వైపు ప్రీ ప్రొడక్షన్ పనులు.. మరో

జక్కన్న-ఎన్టీఆర్-చెర్రీ.. సినిమా: అక్టోబర్‌లో సెట్స్‌పైకి.. శరవేగంగా ఏర్పాట్లు
, బుధవారం, 14 మార్చి 2018 (15:13 IST)
బాహుబలి మేకర్ ఎస్ఎస్ రాజమౌళి తదుపరి ప్రాజెక్టు త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఎన్టీఆర్-చెర్రీ కాంబోలో మల్టీస్టారర్ సినిమా చేసేందుకు రాజమౌళి రెడీ అయ్యాడు. ఇప్పటికే ఓ వైపు ప్రీ ప్రొడక్షన్ పనులు.. మరోవైపు ఇద్దరు హీరోలపై టెస్టు ఫోటో షూట్‌లు కూడా జరుగుతున్నాయి. ఈ విషయాన్ని రమేష్ బాలా ట్విట్టర్ ద్వారా తెలిపారు. 
 
ఈ ఏడాది అక్టోబర్‌లో ఈ సినిమా షూటింగ్ సెట్స్‌పైకి రానుందని.. ఇందులో చెర్రీ, ఎన్టీఆర్ అన్నాదమ్ముళ్లుగా నటించనున్నారని తెలిపారు. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకోనుంది. 
 
ఈ చిత్రం కోసం అమెరికాకు ఎన్టీఆర్, చెర్రీ వెళ్లనున్నారని.. బాడీ స్కాన్, గ్రాఫిక్స్ కోసం వీరు యూఎస్ వెళ్ళాల్సి వుందని సమాచారం. అక్కడ ఫోటో షూట్ కూడా వుంటుందని.. ఇక ఈ చిత్రంలో నటించే హీరోయిన్ల కోసం సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీరెడ్డి కన్నీళ్లు పెట్టేసుకుంది- అమ్మాయిలను వారి వద్దకు కూడా పంపిస్తారు.. వీడియో వైరల్