Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉండవల్లి గ్రామ ఓటర్లుగా చంద్రబాబు కుటుంబ సభ్యులు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు ఉండవల్లి గ్రామ ఓటర్లుగా మారిపోయారు. ఈ మేరకు వారి పేర్లను రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలో ఎక్కించింది.

ఉండవల్లి గ్రామ ఓటర్లుగా చంద్రబాబు కుటుంబ సభ్యులు
, బుధవారం, 14 మార్చి 2018 (15:07 IST)
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు ఉండవల్లి గ్రామ ఓటర్లుగా మారిపోయారు. ఈ మేరకు వారి పేర్లను రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలో ఎక్కించింది. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రకు వచ్చి, ఉండవల్లి కరకట్టపై ఉన్న భవనాన్ని నివాసంగా మార్చుకుని చంద్రబాబు పాలన సాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాడేపల్లి మండలం, ఉండవల్లి గ్రామంలో తమను ఓటర్లుగా చేర్చాలని చంద్రబాబు కుటుంబం దరఖాస్తు చేసుకుంది. 
 
దీన్ని పరిశీలించిన ఎన్నికల సంఘం అధికారులు.. సీఎంతో పాటు ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి పేర్లను ఇంటి నంబర్ 3-781/1లో ఉంటున్నట్టు నమోదు చేసి, ఓటరు లిస్టులోకి ఎక్కించారు. దీంతో ఇకపై జరిగే ఎన్నికల్లో చంద్రబాబు ఫ్యామిలీ సభ్యులు ఉండవల్లి గ్రామస్తులతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ పాలిట తొలి విలన్ కాంగ్రెస్ పార్టీనే : కేసీఆర్ నిప్పులు