అలా చేయడం వల్ల నష్టపోతున్నానంటున్న దర్శకుడు

సాధారణంగా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నది నానుడి. అలాగే, ఇండస్ట్రీలో మంచి పేరు ఉన్నపుడే నాలుగు రూపాయలు సంపాదించుకుని వెనుకేసుకోవాలని ప్రతి ఒక్కరూ భావిస్తుంటారు.

Webdunia
మంగళవారం, 27 మార్చి 2018 (12:04 IST)
సాధారణంగా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నది నానుడి. అలాగే, ఇండస్ట్రీలో మంచి పేరు ఉన్నపుడే నాలుగు రూపాయలు సంపాదించుకుని వెనుకేసుకోవాలని ప్రతి ఒక్కరూ భావిస్తుంటారు. ఇలాంటి వారిలో దర్శకులు కూడా ఉంటారు. ఒక సినిమా హిట్ అయితే, ఆ తర్వాత నాలుగైదు సినిమాలు ఒప్పేసుకుని కోట్లకు కోట్లు గడిస్తుంటారు. కానీ, ఆ దర్శకుడు మాత్రం అలా కాదు. యేడాదికి ఒక్క సినిమా తీసినా అది బాగుండాలని కోరుకుంటారు. అలాంటి దర్శకుడు సుకుమార్. 
 
ఈయన దర్శకత్వంలో తాజాగా తెరకెక్కిన చిత్రం రంగస్థలం. రామ్ చరణ్ - సమంత హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం ఈనెల 30వ తేదీన రిలీజ్ కానుంది. అయితే, పల్లెటూరి నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నిజానికి సుకుమార్ సినిమా వస్తుంది అంటే చాలు జయాపజయాలకు అతీతంగా ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు. ఆయన స్టయిల్ ఆఫ్ మేకింగ్‌కి ఎందరో అభిమానులున్నారంటే అతిశయోక్తి కాదు. సినిమా చేస్తున్నాడంటే ఎటువంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. 
 
అలాంటి సుకుమార్.. తన వర్కింగ్ స్టైల్ గురించి మాట్లాడుతూ, 'నేను సినిమాలు తీయడానికి ఎక్కువ సమయం తీసుకుంటానని అంతా అంటుంటారు. కానీ నేను చేసిన ఏ సినిమా అయినా షూటింగ్ మొదలైన తర్వాత స్పీడ్‌గానే పూర్తవుతుంది. కాకపోతే కథ కోసమే ఎక్కువ టైమ్ తీసుకుంటాను. కథ అంతా సిద్ధం అయ్యే సరికి టైమ్ పడుతుంది. ఆ తర్వాత షూటింగ్ మాత్రం అనుకున్న టైమ్‌లోనే పూర్తి చేస్తాను. దీనివల్ల నా నిర్మాతలకు లాభమే కానీ నష్టముండదు. మంచి కథతో సినిమా తీస్తే వారికే మంచిది కదా. కాకపోతే నష్టపోయేది నేనే. ఎందుకంటే అందరిలా ఏడాదికి రెండు, మూడు సినిమాలు చేయలేను. 'రంగస్థలం'ని సంవత్సరంలోపే పూర్తి చేశాం అని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

AI vs Indian Intelligence, అపార్టుమెంట్ గృహ ప్రవేశానికి గోవుకి బదులు గోవు మరబొమ్మ (video)

వరల్డ్ కప్ గెలుచుకున్న ఆ క్షణాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాం.. నారా బ్రాహ్మణి (video)

పాడు కుక్క తెల్లార్లూ మొరుగుతూ నిద్ర లేకుండా చేసింది, అందుకే చంపేసా (video)

నీ కోసం నా భార్యను చంపాను.. ప్రియురాలికి మెసేజ్ పంపిన డాక్టర్ భర్త

వదిన పెళ్లి కోసం వుంచిన రూ.50 లక్షల విలువైన ఆభరణాలు దొంగలించిన మహిళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments