Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ సోకి రాంగోపాల్ వర్మ కజిన్ సోదరుడు మృతి

Webdunia
సోమవారం, 24 మే 2021 (13:46 IST)
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. కరోనా సోకి వర్మ సోదరుడు (కజిన్) కన్నుమూశారు. ఆయన పేరు పి. సోమశేఖర్. కొన్ని రోజుల క్రితం ఆయనకు కరోనా వైరస్ సోకడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ వచ్చారు. అయితే, ఆదివారం రాత్రి ఆయన తుది శ్వాస విడిచారు. 
 
కాగా, సోమశేఖర్ గత 2010లో మస్క్‌రకే దేఖ్ జరా అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. అలాగే, సత్య, రంగీల, దౌడ్, జంగిల్, కంపెనీ వంటి చిత్రాల్లో నిర్మాణ భాగస్వామిగా కూడా వ్యవహరించారు. తన ఎదుగుదలలో సోమశేఖర్ ఎంతగానో సహాయం చేశారంటూ రాంగోపాల్ వర్మ పలు సందర్భాల్లో చెప్పారు. కాగా, సోమశేఖర్ మృతిపట్ల సినీ పరిశ్రమకు చెందిన అనేక మంది ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. 

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments