Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెహబూబాతో పోల్చితే పోకిరి ఫ్లాప్: రామ్ గోపాల్ వర్మ

దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు డైరక్టర్ పూరీ జగన్నాథ్ శిష్యుడనే విషయం తెలిసిందే. వర్మ-పూరీ అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. తాజాగా తన కుమారుడు ఆకాష్‌ను హీరోగా పెట్టి 'మెహబూబా' పేరిట ఓ సినిమాకు పూరీ దర్

Webdunia
సోమవారం, 22 జనవరి 2018 (09:35 IST)
దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు డైరక్టర్ పూరీ జగన్నాథ్ శిష్యుడనే విషయం తెలిసిందే. వర్మ-పూరీ అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. తాజాగా తన కుమారుడు ఆకాష్‌ను హీరోగా పెట్టి 'మెహబూబా' పేరిట ఓ సినిమాకు పూరీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను వర్మకు పూరీ చూపించాడు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను చూసిన వర్మ తనదైన శైలిలో కామెంట్లు పెట్టారు.
 
'మెహబూబా'లోని కొన్ని సన్నివేశాలను చూశానని.. ఈ సినిమాతో పోలిస్తే 'పోకిరి' ఫ్లాప్‌ అంటూ షాకింగ్ కామెంట్ ఇచ్చాడు. తన కుమారుడి మీద ఉన్న ప్రేమతో పూరీ ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా తీశాడని ప్రశంసలు కురిపించాడు. దీనిపై పూరీ జగన్నాథ్ కూడా స్పందించారు. "మా బాస్ మొదటిసారి నన్ను చిత్ర దర్శకుడిగా గుర్తించాడు. నా జీవితంలో ఇదే పెద్ద ప్రశంస. లవ్ యు సర్" అంటూ కామెంట్ పెట్టాడు.
 
ఇదిలా ఉంటే.. రాంగోపాల్ వర్మ సంచలన దర్శకుడు. అతడు ఏం మాట్లాడినా సంచలనమే. ఓ వైపు సినిమాలు తీస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్‌లు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఏకంగా పోర్న్ స్టార్‌తో ఓ లఘు చిత్రాన్ని తీస్తున్నారు. అయితే ఇది ఒక సినిమా కాదని, షార్మ్ ఫిల్మ్ కాదని, వెబ్ సిరీస్ కూడా కాదని.. ఇది సెక్స్ మీద మియా మాల్కోవా స్వాగతమని వర్మ చెప్తున్నారు. ఈ సినిమాపై మహిళా సంఘాలు మండిపడుతున్నప్పటికీ వర్మ తన సినిమాను విడుదల చేయడంపై మనసు పెట్టాడు. 

సంబంధిత వార్తలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం