Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుష్ట పూర్వీకులు సమాజంపై రుద్దిన పాపిష్టి ఆచారమే వివాహం : రాంగోపాల్ వర్మ

Webdunia
మంగళవారం, 18 జనవరి 2022 (13:11 IST)
చిత్రపరిశ్రమకు చెందిన సెలెబ్రిటీలు ఒక్కొక్కరుగ విడిపోతున్నారు. ఇటీవల తెలుగు సినిమాకు చెందిన అక్కినేని నాగ చైతన్య, ఆయన భార్య, హీరోయిన్ సమంతలు విడిపోయారు. తాజాగా తమిళ చిత్రపరిశ్రమకు చెందిన స్టార్ హీరో ధనుష్, ఆయన సతీమణి, సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య దంపతులు విడాకులు తీసుకోనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. దీనిపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. "మన దుష్ట పూర్వీకులు సమాజంపై రుద్దిన పాపిష్టి ఆచారమే వివాహం. అసంతృప్తి, విచారంతో నిరంతరం కొనసాగేందుకే ఇది" అంటూ కామెంట్స్ చేశారు. 
 
అంతేకాకుండా, తన ట్విట్టర్ ఖాతా పేజీలో వివాహం గురించి అనేక ఘాటైన పోస్టులను ఆయన షేర్ చేశారు. "వివాహంతో కొని తెచ్చుకునే ప్రమాదాల గురించి యువతను హెచ్చరించేందుకు స్టార్ విడాకులు మంచి ట్రెండ్ సెట్టర్స్. విడాకులను సంగీత్ కార్యక్రమంతో వేడుకలా చేసుకోవాలి. ఎందుకంటే స్వేచ్ఛను పొందుతున్నందుకు" అని పేర్కొన్నారు.  
 
"ఒకరిలోని ప్రమాదకర లక్షణాలను మరొకరు పరీక్షించుకునేందుకే పెళ్లిళ్లు. ప్రేమను పెళ్లికి మించి వేగంగా చంపేసేది మరేదీ లేదు. సంతోషానికి రహస్యం ఏమిటంటే జైలుకు వెళ్లడంలాంటి పెళ్లి చేసుకోవడానికి కంటే వీలైనంత కాలం ప్రేమిస్తూ ఉండటమే ఉత్తమం" అంటూ రాంగోపాల్ వర్మ కామెంట్స్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Raja murder fallout: రాజా రఘువంశీ హత్య: పర్యాటకుల వివరాలు తప్పనిసరి.. మేఘాలయ

ఎయిరిండియా విమాన ప్రమాదానికి కుడివైపు ఇంజినే కారణమా?

Jagan Rally: గుంటూరులో జగన్ ర్యాలీ.. కాన్వాయ్ కారు ఢీకొని వృద్ధుడు మృతి (video)

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ - సోదరుడు పాడె మోసిన విశ్వాస్ కుమార్

హోటల్‌లో చోరీకి వచ్చి ఆమ్లెట్ వేసుకుని ఆరగించిన దొంగ.. (Vide)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments