Webdunia - Bharat's app for daily news and videos

Install App

బడా హీరోలతో సినిమాలు తీసే ఓపిక నాకు లేదు : ఆర్జీవీ

Webdunia
గురువారం, 7 ఏప్రియల్ 2022 (08:30 IST)
పెద్ద హీరోలతో సినిమాలు తీసే ఓపిక, సామర్థ్యం తనకు లేవని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ అన్నారు. పైగా, తాను నిర్మించే చిత్రం ఎంత బడ్జెట్‌లో చేశాననే విషయాన్ని మాత్రం ఆలోచన చేస్తానని చెప్పారు. తాజాగా ఆయన తెరకెక్కించిన "మా ఇష్టం" (డేంజరస్) చిత్రం శుక్రవారం విడుదలకానుంది. 
 
ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ, పెద్ద హీరోలు, భారీ బడ్జెట్‌తో సినిమాలు చేసే ఓపిక, సామర్థ్యం, తపన తనకు లేవన్నారు. తనను ఆసక్తికి గురిచేసే అంశాలతోనే సినిమాలు నిర్మిస్తానని చెప్పారు. తాను తీసే చిత్రాన్ని ఎంతమంది చూశారు, ఎలా వుంది అన్నదానికంటే ఎంత బడ్జెట్‌లో తీశానన్న విషయాన్ని మాత్రమే ఆలోచన చేస్తానని చెప్పారు. పైగా, ఇప్పటివరకు తాను తీసిన చిత్రాన్ని లాభాలను తెచ్చి పెట్టాయని, అందుకే తాను సినిమాలు తీయగలుగుతున్నట్టు చెప్పారు. 
 
ఇకపోతే తాను తాజాగా నిర్మించి "మా ఇష్టం" చిత్రం స్వలింగ సంపర్కుల గురించి అని చెప్పారు. సుప్రీంకోర్టు కూడా 377 ఆర్టికల్‌ను రద్దు చేసిందని గుర్తు చేసింది. పైగా, ఎప్పటినుంచి స్వలింగ సంపర్కుల గురించి మాట్లాడుకుంటున్నామని, వారు కూడా మనుషులేనని చెప్పారు. 
 
అయితే, తాను ఆ అంశాల జోలికి వెళ్లలేదన్నారు. కానీ ఇద్దరు అమ్మాయిలు లెస్బియన్స్ ఎందుకు అయ్యారన్న అంశాన్ని మాత్రమే చూపించానని చెప్పారు. ఇందులో యాక్షన్ సీన్స్‌ ఎక్కువగానే ఉన్నాయన్నారు. పైగా, ఇద్దరు అమ్మాయిల మధ్య రొమాంటిక్ డ్యూయెట్ సాంగ్‌ను కూడా చిత్రీకరించామని, ఇలాటి సాంగ్ చేయడం ఇదే తొలిసారి అని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వాళ్లపాటికి వాళ్లు చచ్చిపోయారు, మాపాటికి మేము ఖుషీగా చిందులేస్తాం: ఇదీ ఎయిర్ ఇండియా సాట్స్ ఎస్విపి

ప్రియుడు మరో యువతిని పెళ్లి చేసుకున్నాడనీ... భగ్నప్రేమికురాలి బాంబు బెదిరింపులు

పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది.. ఎన్నికల్లో విజయం మాదే : సజ్జల

Airspace ban: గగనతల మూసివేతను జూలై 24 వరకు పొడిగించిన భారత్

LPG: లీక్ అయిన ఎల్పీజీ సిలిండర్.. కాసేపయ్యాక భారీ పేలుడు.. ఆ ఇద్దరికి ఏమైంది..? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments