Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయ కుట్రల విషంతో నిండిన "వ్యూహం" : వర్మ వెల్లడి

Webdunia
గురువారం, 27 అక్టోబరు 2022 (16:17 IST)
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మళ్లీ మరో కొత్త సినిమాను నిర్మించనున్నారు. ఇందుకోసం ఆయన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టారు. బుధవారం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ప్రత్యేకంగా లంచ్ సమావేశం జరిపారు. అపుడే ఆయన ఓ సినిమా తీయనున్నారనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో అందరూ ఊహించినట్టుగానే తాను కొత్త చిత్రం నిర్మించనున్నట్టు గురువారం ప్రకటించారు. ఇది రాజకీయ సినిమా అని సోషల్ మీడియాలో వెల్లడించారు. అయితే, ఇది బయోపిక్ కాదని, బయోపిక్ కంటే లోతైన రియల్ పిక్ అని వెల్లడించారు. 
 
బయోపిక్‌లో అయినా అబద్దాలు ఉంటాయేమో గానీ రియల్ పిక్‌లో నూటికి నూరుపాళ్ళు నిజాలే ఉంటాయని వెల్లడించారు. అహంకారానికి ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుంచి ఉద్భవించినదే వ్యూహం కథ అని వర్మ వివరించారు. 
 
ఇది రాజకీయ కుట్రల విషంతో నిండి ఉంటుందని, రాచకురుపు పైన వేసిన కారంతో బొబ్బలెక్కిన ఆగ్రహాన్ని ప్రతిబింభించేలా ఈ చిత్రం ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రజలు మొదటి చిత్రం వ్యూహం షాక్ నుంచి తేరుకునేలోపు రెండో భాగం శపథంలో మరో ఎలక్ట్రిక్ షాక్ తగులుతుందన్నారు. కాగా, తనతో వంగవీటి చిత్రాన్ని నిర్మించిన దాసరి కిరణ్ ఈ పొలిటికల్ చిత్రానికి కూడా నిర్మాతగా వ్యవహరిస్తారని వర్మ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

పెళ్లి- ఫుడ్ స్టాల్.. తందూరీ, రోటీల విషయంలో గొడవ.. ఇద్దరు యువకుల బలి.. ఎలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments