Webdunia - Bharat's app for daily news and videos

Install App

"రంగస్థలం" మొక్కు తీర్చుకున్న చిట్టిబాబు భార్య... నేడు సక్సెస్ మీట్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన శ్రీనివాసుడికి మొక్కు తీర్చుకున్నారు. తన భర్త నటించిన తాజా చిత్రం రంగస్థలం సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెల్సిందే. ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దీంతో

Webdunia
శుక్రవారం, 13 ఏప్రియల్ 2018 (09:02 IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన శ్రీనివాసుడికి మొక్కు తీర్చుకున్నారు. తన భర్త నటించిన తాజా చిత్రం రంగస్థలం సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెల్సిందే. ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దీంతో చెర్రీ భార్య కామినేని ఉపాసన కాలినడకన వెళ్లి ఏడుకొండల వాడిని దర్శించుకున్నారు.
 
గురువారం సాయంత్రం నడకను ప్రారంభించిన ఆమె, కొన్ని ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. ఆపై శుక్రవారం ఆమె వీఐపీ బ్రేక్ సమయంలో స్వామిని దర్శించుకున్నారు. తితిదే సిబ్బంది ఆమెకు దర్శన ఏర్పాట్లు చేశారు. కాగా, రెండు వారాల క్రితం విడుదలైన 'రంగస్థలం' బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లను రాబడుతూ దూసుకెళుతున్న సంగతి తెలిసిందే.
 
మరోవైపు రంగస్థలం సక్సెస్ మీట్ హైదరాబాద్, యూసఫ్‌గూడలోని పోలీస్ మైదానంలో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు జరుగనుంది. ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అలాగే, మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరుకావొచ్చని భావిస్తున్నారు. ఇందుకోసం చిత్ర నిర్మాతలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ అంతా పాల్గొననుంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments