చెర్రీ భార్య ఎమోషనల్ ట్వీట్... నాతో కలిసి నా బేబీ కూడా అనుభూతిని పొందింది...

Webdunia
గురువారం, 12 జనవరి 2023 (16:24 IST)
"ఆర్ఆర్ఆర్" చిత్రంలోని 'నాటునాటు' పాటకు ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డు వరించింది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ అవార్డును ఆ పాట సృష్టికర్త (సంగీత దర్శకుడు) ఎంఎం కీరవాణి అందుకున్నారు. అయితే, ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి కీరవాణి దంపతులు, చిత్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, ఆయన సతీమణి రమా రాజమౌళి, హీరోలు జూనియర్ ఎన్టీఆర్ - ప్రణతి, రామ్ చరణ్ - ఉపాసన దంపతులు హాజరయ్యారు. 'నాటునాటు' పాటకు అవార్డు దక్కడంతో వారందరి సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. దీన్ని పురస్కరించుకుని ఉపాసన ఒక ఎమోషనల్ ట్వీట్ చేశారు. 
 
"ఆర్ఆర్ఆర్ చిత్రానికి అవార్డు లభించండం, ఈ చారిత్రక సందర్భంలో కడుపులో బిడ్డ సహా తాను పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆర్ఆర్ఆర్ కుటుంబంలో భాగమైనందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఇది దేశం గర్వించే విజయం. ఈ ప్రయాణంలో నన్ను భాగస్వామిని చేసిన రామ్ చరణ్‌, దర్శకుడు రాజమౌళికి ధన్యవాదాలు. నాతో కలిసి నా బేబీ (పుట్టబోయే బిడ్డ) కూడా ఈ అనుభూతిని పొందుతున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నా. చాలా ఉద్వేగంగా కూడా ఉంది" అంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో వారంతా దిగిన గ్రూపు ఫోటోను రాజమౌళి షేర్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో బ్రూక్‌ఫీల్డ్ 1.04 గిగావాట్ హైబ్రిడ్ ఎనర్జీ ప్రాజెక్ట్ కోసం రూ. 7,500 కోట్లు మంజూరు

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. కుక్కర్ల నుంచి లిక్కర్స్ వరకు.. పిల్లల్నీ వదిలిపెట్టలేదట

Aadudham Andhra: ఆడుదాం ఆంధ్రలో అవకతవకలు.. ఆర్కే రోజా అరెస్ట్ అవుతారా?

తిరుమల వెంకన్నను దర్శించుకున్న ఏడు అడుగుల ఎత్తున్న మహిళ.. షాకైన భక్తులు (Video)

39 ఫామ్‌హౌస్‌లలో ఆకస్మిక తనిఖీలు.. డీజేలు, హుక్కా, మద్యం.. స్కూల్ స్టూడెంట్స్ ఎలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments