Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం... మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రతిమ

ఠాగూర్
మంగళవారం, 22 అక్టోబరు 2024 (20:15 IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం లభించనుంది. ప్రఖ్యాత మ్యూజియం మేడమ్ టుస్సాడ్స్‌లో చెర్రీ మైనపు బొమ్మను ప్రతిష్టించనున్నారు. సింగపూర్ మేడమ్ టుస్సాడ్స్‍‌లో ప్రముఖుల మైనపు బొమ్మలు ఏర్పాటు చేస్తున్న విషయం తెల్సిందే. తాజాగా టుస్సాడ్ ప్రతినిధులు రామ్ చరణ్ కొలతలు తీసుకున్నారు. చెర్రీ మైనపు బొమ్మను 2025 వేసవి నాటికి అక్కడ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. సినిమా రంగానికి చెర్రీ చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకు ఈ అరుదైన గౌరవం కల్పించనున్నారు. 
 
సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో తనకు స్థానం లభించడం ఎంతో గౌరవంగా భావిస్తు్న్నానని రామ్ చరణ్ పేర్కొన్నారు. తాను చిన్న వయసులో ఉన్నపుడు దిగ్గజ వ్యక్తులను అక్కడ చూసి ఆనందించేవాడినని, కానీ, ఏదో రోజున అలాంటి వారి మధ్య తాను ఉంటానని కలలో కూడా ఊహించలేదని చెప్పారు. సినిమా కోసం తాను పడే తపన, కృషి, అభిరుచికి ఇది గుర్తింపు అన్నారు. ఇలాంటి అద్భుతమైన అవకాశం దక్కించుకున్నందుకు తాను మ్యూజియం నిర్వాహకులకు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

పవన్ కళ్యాణ్ కాన్వాయ్ దెబ్బ - పరీక్షకు హాజరుకాలేకపోయిన విద్యార్థులు... (Video)

బట్టతలపై జుట్టు అనగానే క్యూ కట్టారు.. ఇపుడు లబోదిబోమంటున్నారు.. (Video)

క్రికెట్ బెట్టింగ్‌-ఐదు కోట్ల బెట్టింగ్ రాకెట్-హన్మకొండలో బుకీ అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments