Webdunia - Bharat's app for daily news and videos

Install App

కైరా అద్వానీతో రామ్‌చరణ్ వ్యాయామం... వైరల్ అవుతున్న వీడియో...

''రంగస్థలం'' సినిమా తర్వాత బోయపాటి శీను దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బ్యాంకాక్‌లో జరుగుతోంది. షూటింగ్ గ్యాప్‌లో

Webdunia
ఆదివారం, 20 మే 2018 (11:09 IST)
''రంగస్థలం'' సినిమా తర్వాత బోయపాటి శీను దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బ్యాంకాక్‌లో జరుగుతోంది. షూటింగ్ గ్యాప్‌లో చెర్రీ చెరువులో చేపలకు ఆహారం వేయగా అందుకు సంబంధించిన వీడియోను ఆయన భార్య ఉపాసన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
 
అలాగే, ఈ సినిమా హీరోయిన్‌ కైరా అద్వానీతో కలిసి రామ్‌ చరణ్‌ వ్యాయామం చేస్తోన్న మరో వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చెర్రీ ఈ కొత్త సినిమాకి దేవీశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు.
 
బోయపాటి సినిమా కోసం సరికొత్త యాంగిల్‌లో కనిపించేందుకు చెర్రీ బాడీ డెవలప్‌ చేస్తుండగా, కైరా కూడా తానేం తక్కువ కాదంటూ ఎక్సర్‌సైజులు చేసింది. సరదాగా ఆ వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయగా, వైరల్‌ అవుతోంది. ఇక ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు యాక్షన్‌ ఎలిమెంట్స్‌తో కూడిన ఎంటర్‌టైనర్‌గా బోయపాటి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు నిర్మాత దానయ్య చెప్పారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ice Cream: ఐస్‌క్రీమ్‌లో బల్లి.. ఆ బాలుడికి ఏమైందంటే?

మహిళలపై దాడి చేసిన వైకాపా నేతలను వదిలిపెట్టను : మంత్రి లోకేశ్ మాస్ వార్నింగ్

వైకాపాకు పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని లేదు.. 2027నాటికి పూర్తి: రామానాయుడు

దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి డ్యాన్స్ చూసి ఏడుస్తారెందుకు?(video)

ఆర్ఎంపీ ఇంటి తాళం పగులకొట్టి బంగారం కొట్టేశాడు.. దొంగ ఎవరంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments