Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రగ్స్ తీసుకునే తనూశ్రీ.. ఈరోజు పెద్దపెద్ద కబుర్లు చెబుతోంది : రాఖీసావంత్

Webdunia
సోమవారం, 22 అక్టోబరు 2018 (09:20 IST)
ప్రముఖ నటుడు నానా పటేకర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన బాలీవుడ్ నటి తనూశ్రీ దత్తాపై మరో బాలీవుడ్ సెక్సీ క్వీన్ రాఖీ సావంత్ సంచలన ఆరోపణలు చేసింది. డ్రగ్స్ తీసుకుని స్పృహ లేకుండా పడిపోయే తనూశ్రీ ఇపుడు పెద్దపెద్ద కబుర్లు చెబుతోందంటూ ఆరోపణలు గుప్పించింది. దీంతో రాఖీ సావంత్‌పై తనూశ్రీ దత్తా రూ.10 కోట్లకు పరువునష్టం దావా వేసింది.
 
'మీటూ' ఉద్యమంలో భాగంగా నటుడు నానా పాటేకర్‌ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ తనూశ్రీ దత్తా ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. ఈ ఉదంతంలో పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు తనుశ్రీకి మద్దతు పలికారు. కానీ, నటి రాఖీ సావంత్ బాధితురాలు తనుశ్రీపై పలు ఆరోపణలు గుప్పించారు. 
 
అంతేకాకుండా, తనుశ్రీ డ్రగ్స్ తీసుకుని వ్యాన్‌లో ఉండగా, తాను నానా పాటేకర్ సలహా మేరకు ఒక సాంగ్ చేయాల్సి వచ్చిందని తెలిపారు. ఈ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ కాంట్రావర్సీ క్వీన్ రాఖీపై తనుశ్రీ రూ.10 కోట్ల మేరకు పరువునష్టం దావా వేశారు. 
 
ఈ ఉదంతం గురించి రాఖీ గతంలో మీడియాతో మాట్లాడుతూ 'ఆరోజు తనుశ్రీ డ్రగ్స్ తీసుకుని వ్యాన్‌లో 4 గంటల పాటు స్పృహ లేకుండా పడివుంది. ఈ రోజు పెద్దపెద్ద కబుర్లు చెబుతున్న తనుశ్రీ అసలు బాగోతం బయపెట్టాలనుకుంటున్నాను. ఆ పాట నేను పూర్తి చేసినందుకు తనుశ్రీ నాకు నోటీసు కూడా పంపించింది. అయితే సినిమా యూనిట్ నన్ను కాపాడింది' అని తెలిపారు. 

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం