Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్ దర్శకుడు మలినేని గోపీచంద్‌కు సూపర్ స్టార్ ఫోన్‌ కాల్

Webdunia
సోమవారం, 30 జనవరి 2023 (11:53 IST)
టాలీవుడ్ దర్శకుడు మలినేని గోపీచంద్‌కు సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి ఫోన్ కాల్ వెళ్లింది. ఈ విషయాన్ని గోపీచంద్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఇటీవల బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో "వీరసింహారెడ్డి" చిత్రం వచ్చింది. ఇది ఘన విజయం సాధించింది. 
 
పైగా మంచి వసూళ్లను రాబట్టింది. బాలయ్య మాస్ అప్పీరెన్స్‌కు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని గోపీచంద్ తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ వీక్షించారు. ఆ తర్వాత గోపీచంద్ మలినేనికి ఫోన్ చేసి అభినందించినట్టు దర్శకుడు తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.
 
"ఇది నాకు నమ్మలేని నిజం. సూపర్ స్టార్, తలైవర్ రజనీకాంత్ సార్ నుంచి ఫోన్ వచ్చింది. ఆయన "వీరసింహారెడ్డి" సినిమను చూశారు. ఆయనకు ఎంతో నచ్చింది. సినిమాను ప్రశంసిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు, ఆయన భావోద్వేగం ఈ ప్రపంచంలో తనకు అన్నింటికంటే ఎక్కువ. థ్యాంక్యూ రజనీ సార్" అంటూ ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kalpika Ganesh: ప్రిజమ్ పబ్ వ్యవహారం.. కల్పికా గణేష్‌పై గచ్చిబౌలి స్టేషన్‌లో కేసు

భర్త దుబాయ్‌లో వుంటే భార్య వివాహేతర సంబంధం..వద్దు పోమ్మంది.. అంతే సూసైడ్

Vizag: విశాఖలో పౌర విమానయాన విశ్వవిద్యాలయం-సెప్టెంబర్ తర్వాత సీప్లేన్ కార్యకలాపాలు

No More Ration Rice : మధ్యాహ్నా భోజన పథకంలో ఇకపై సన్నబియ్యం

Delhi: ఢిల్లీపై భానుడు ప్రతాపం- వేడిగాలులు వీస్తూనే వుంటాయ్.. రెడ్ అలెర్ట్ జారీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments